జైనథ్, మార్చి 20: సీఎం కేసీఆర్ చేస్తు న్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. మండలంలోని బెల్లూరిలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన 50మంది యువకులు టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే జోగు రామన్న కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. అనంతరం గ్రామంలో నిర్మించిన శ్మశాన వాటికను ప్రారంభించారు.
జిల్లాలోనే అతి పురాతన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జైనథ్లోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, వైస్ఎంపీపీ విజయ్కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బాలురి గోవర్ధన్రెడ్డి, జిల్లా డైరెక్టర్ చంద్రయ్య, ఐటీడీఏ డైరెక్టర్ పెందూర్ దేవన్న, ఆలయ కమిటీ చైర్మన్ పుండ్రు వెంకట్రెడ్డి, గణేశ్ యాదవ్, సర్పంచ్లు దేవన్న, రూప, ఎంపీటీసీలు ఇందిర, సుదర్శన్, నాయకులు రాంరెడ్డి, దత్తు, పురుషోత్తం రెడ్డి ఉన్నారు.
ఎదులాపురం,మార్చి 20 : సీఎం కేసీఆర్ స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని సాయినగర్లో ఆదివారం ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశారు. ముందుగా ఎమ్మెల్యేను డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఉద్యోగ నియామకాల్లో 95 శాతం స్థానికులకు అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు. ఆదిలాబాద్ లాంటి మారుమూల జిల్లాలో ఐటీ పరిశ్రమ ఏర్పాటు మంత్రి కేటీఆర్ కృషితోనే సాధ్యమైందన్నారు. ఇప్పటికే 280 మందికి నియామక పత్రాలు అందించినట్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా యువత పోటీ పరీక్షలకు స్థానికంగా శిక్షణ పొందేలా జోగు ఫౌండేషన్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఆదిలాబాద్ జిల్లాలో టెక్స్టైల్స్ పార్కు ఏర్పాటు కానుందని వెల్లడించారు. రేణుక సిమెంట్ పరిశ్రమ కూడా జూన్లో పనులను ప్రారంభించనునందని చెప్పారు. 30 పడకల దవాఖాన, జూనియర్ కళాశాలలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి, కౌన్సిలర్ కృష్ణ, కాలనీ వాసులు ఆనంద్ రెడ్డి, కేదార్నాథ్, సంజీవరెడ్డి, రాథోడ్ రమేశ్, వామన్, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.