మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 29 : జిల్లాలో ఇంటర్మీడి టయట్ సెకండియర్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని 25 సెంటర్లలో 6,664 (5,545 జనరల్, 1,119 వొకేషనల్) మంది విద్యార్థులకు 6,414 (5,332 జనరల్, 1,083 వొకేషనల్) మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
250 (213 జనరల్, 37 వొకేషనల్) మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. నిమిషం నిబంధన అమలు కారణంగా ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు. పలు కేంద్రాలను డీఐఈవో శైలజ పరిశీలించారు.