ఖానాపూర్ టౌన్, డిసెంబర్ 12 : ఖానాపూర్ మున్సిపాలిటీలో ఆధునిక హంగులతో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు చురుగ్గా సా గుతున్నా యి. సమీకృత మార్కెట్ అందుబాటులోకి వస్తే ఖానాపూర్ ప్రజలకే కాకుండా నియోజకవర్గం లోని కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల ప్రజ లకు నిత్యం అన్నిరకాల కూరగాయలు, మాం సం, పాలు, పండ్లు, పూలు అందుబాటులో ఉండనున్నాయి. ప్రస్తుతం మార్కెట్ నిర్మాణం పిల్లర్లతో సహా తదితర పనులు 50 శాతం పూర్త య్యాయి. ఇందులో శాఖాహారం కోసం 26 స్టాల్స్, మాంసహారం కోసం 24 స్టాల్స్ మొత్తం 50 కేంద్రాలను నిర్మిస్తున్నారు. సమీకృత మార్కె ట్ నిర్మాణంతో మున్సిపాలిటీలో ట్రాఫిక్ ఇబ్బం దులు, ప్రమాదాలు తగ్గనున్నాయి. పట్టణంలో పారిశుధ్యం మెరుగుపడి వాహనదారులకు ఇబ్బం దులు తొలగనున్నాయి. ఆధునాతన సదు పాయలతో ఒకే ప్రాంగణంలో సమీకృత మార్కెట్ ను నిర్మిస్తుండడంతో పట్టణ, నాలుగు మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.