రైతు సంక్షేమమే బీఆర్ఎస్ సర్కారు ధ్యేయమని, దేశంలో ఎక్కడా లేనన్ని పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కొనియాడారు. శుక్రవారం సిర్పూర్ నియోజకవర్గంలో ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలసి సుడిగాలి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆయాచోట్ల ఆయన మాట్లాడుతూ పోడు భూములకు పట్టాలందించి దశాబ్దాల కల నెరవేర్చామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, రాబోయే ఎన్నికల్లో ఆయనను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం పలు మండలాల నుంచి 200 మంది బీఆర్ఎస్లో చేరగా, వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
– కాగజ్నగర్/బెజ్జూర్/కౌటాల/చింతలమానేపల్లి/సిర్పూర్(టీ), సెప్టెంబర్ 29
కాగజ్నగర్/బెజ్జూర్/కౌటాల/చింతలమానేపల్లి/సిర్పూర్(టీ), సెప్టెంబర్ 29 : రైతు సంక్షేమమే బీఆర్ఎస్ ధ్యేయమని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సిర్పూర్ నియోజకవర్గంలో ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలసి సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కౌటాల మండలం గుండాయిపేట సమీపంలో వార్దా నదిపై రూ.75 కోట్లతో నిర్మించనున్న అంతర్రాష్ట్ర హైలెవల్ వంతెన, కౌటాల మండలంలో రూ. కోటీ 95 లక్షలతో నిర్మించనున్న మొగఢ్దగఢ్ -వైగాం రోడ్డుకు, రూ. 1.5 కోట్లతో చేపట్టబోయే చింతలపాటి-కోయగూడ రోడ్డుకు భూమి పూజ చేశారు. చింతలమానేపల్లి మండలం రవీంద్రనగర్ -2 సమీపంలో రూ. 57 కోట్లతో నిర్మించనున్న 132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్కు, రూ.2.60 కోట్లతో నిర్మించనున్న చింతలమానేపల్లి-గంగాపూర్ రోడ్డుకు, రూ. కోటీ 95 లక్షలతో నిర్మించనున్న కర్జెల్లి-బారెగూడ రోడ్డుకు భూమి పూజ చేశారు. దిందా వాగుపై రూ. 2.50 కోట్లతో నిర్మించనున్న వంతెనకు భూమి పూజ చేశారు. సిర్పూర్(టీ) మండలం అచ్చెల్లి-చింతకుంట ప్రధాన రహదారిపై రూ. 5.30 కోట్లతో పూర్తయినా బ్రిడ్జిని ప్రారంభించారు.
అనంతరం హీరాపూర్ – సిర్పూర్(టీ)లోని శివపూర్ కాలనీ వరకు రూ. 2 కోట్లతో మంజూరైన బీటీ రోడ్డుకు భూమి పూజ చేశారు. మండలకేంద్రంలోని పాతట్లగూడ వద్ద సుమారు రూ. 3 కోట్లతో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు. సిర్పూర్(టీ) పట్టణంలోని ఎస్టీ కాలనీలో రూ. 10 లక్షలతో నిర్మించనున్న ఆదివాసీ భవన్కు భూమిపూజ చేశారు. కౌటాల మండల కేంద్రంలోని జగదాంబ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అల్లోల మాట్లాడుతూ పోడుపట్టాలందించి.. దశాబ్దాల కల నెరవేర్చిన ఘనత బీఆర్ఎస్ సర్కారుదేనన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం పచ్చగా.. చల్లగా ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో పథకాలు అమలు చేయడం చేతగాకే బీఆర్ఎస్పై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అర్హులైన వారికి గృహలక్ష్మి పథకం కింద రూ. రూ. 3 లక్షలు అందిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కార్మికుల శేయస్సు కోసం మూతపడ్డ పేపర్ మిల్లును తెరిపించారన్నారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని. ప్రతీ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే వరకూ పట్టుబట్టాడని చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సిర్పూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 200 మంది బీఆర్ఎస్లో చేరారు.
ఊర్లో పరపతి లేనోళ్లు.. రాజ్యం చేయాలని వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పేర్కొన్నారు. మీటింగ్లు పెట్టడం.. బిర్యానీ ప్యాకెట్లతో బేరసారాలు చేస్తున్నారని ప్రతిపక్ష నాయకులనుద్దేశించి అన్నారు. సిర్పూర్(టీ) నియోజక వర్గానికి చెందిన ప్రజలు, కూలీలు గతంలో ఉపాధి కోసం ఖమ్మం, గుంటూరు వెళ్లే వారని, ఇప్పుడు సీఎం కేసీఆర్ చొరవతో పక్క రాష్ర్టాల కూలీలు ఇక్కడికొచ్చి ఉపాధి పొందుతున్నారని చెప్పారు. సబ్బండ వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యమని, మూడు గంటల కరెంటిచ్చే కాంగ్రెస్ కావాలో.. మూడు పంటలు పండించే బీఆర్ఎస్ కావాలో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. అంతకుముందు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగిర్ ఎస్పీఎం అతిథి గృహంలో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అటవీ అధికారుల గౌరవ వందనం స్వీకరించారు.
కాగజ్నగర్ నుంచి సిర్పూర్(టీ)లోని పెద్దబండ గ్రామం వద్ద దాదాపు 500 ద్విచక్రవాహనాలతో బీఆర్ఎస్ నాయకులు మంత్రి కాన్వాయ్ ముందు భారీ ర్యాలీ తీశారు. ఎస్పీ సురేశ్ కుమార్ ఆధ్వర్యంలో అదనపు ఎస్పీ, అచ్చేశ్వర్ రావు, కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్, సీఐలు బుద్దె స్వా మి, నాగరాజు, సాదిక్ భారీ బందోబస్తు నిర్వహించారు. ఆయా చోట్ల కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్రావ్, జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ కోండ్ర జగ్గగౌడ్, ఎంపీపీలు విశ్వనాథ్, నానయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివా స్, కో-ఆప్షన్ సభ్యుడు సిద్దిక్, ఎంపీపీ చునార్కర్ సువర్ణ, వైస్ ఎంపీపీ ఈర్త సత్యనారాయణ, మండల కో ఆప్షన్ సభ్యుడు కీజర్హుస్సేన్, ఉప సర్పంచ్ తోట మహేశ్, బీఆర్ఎస్ నాయకులు బోమ్మన శ్రీనివాస్, మొర్రాయి తిరుపతి, అఖిల్, బ్రహ్మయ్య, ఇఫ్ఫత్, మహేందర్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.