ఆర్టీసీకి మేడారం జాతర కలిసొచ్చింది. వారం రోజుల వ్యవధిలో రూ.1.30 కోట్ల ఆదాయం సమకూరింది. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భైంసా, మంచిర్యాల, నిర్మల్ డిపోలు ఉన్నాయి. 310 సర్వీసులు నడిపించగా.. 40,511 మంది ప్రయాణికులు సద్వినియోగం చేసుకున్నారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో మంచి ఆదరణ లభించింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా బస్సులు నడిపించామని, సద్వినియోగం చేసుకున్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంది.
– నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 23
మేడా రం సమ్మక్క, సారలమ్మ జాతరకు ఆదిలాబాద్ ఆర్టీసీ రీజియన్ (ఉమ్మడి జిల్లా) పరిధిలో ఈనెల 13 తేదీ నుంచి 20 తేదీ వరకు 310 ప్రత్యేక బస్సులను నడిపించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు త లెత్తకుండా నిర్మల్, భైంసా, ఆదిలాబాద్, ఉట్నూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల్ బస్ డిపోల నుంచి మేడారం సమ్మక్క సారక్క జాతరకు సర్వీసులను నడిపించారు. జా తరకు వెళ్లే ప్రయాణికులతో దాదాపు అ న్ని ఆర్టీసీ బస్టాండ్లు కిటకిటలాడాయి. ఆయా చోట్ల ప్రయాణికులకు ఎలాంటి ఇ బ్బందులు తలెత్తకుండా నీటి వసతి, మ రుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. ప్రయాణికుల అంచనాలకు తగ్గట్లుగా అధికారులు సర్వీసులు నడిపించడంతో, ప్రజల నుంచి కూడా ఆదరణ పెరిగింది. 30 మంది కంటే ఎక్కువ మంది ఉంటే అక్కడికే ఆర్టీసీ బస్సును పంపించింది.
ఉమ్మడి ఆదిలాబాద్ రీజియన్ నుంచి 310 సర్వీసులను అధికారులు నడిపించారు ఇందులో నిర్మల్ డిపో నుంచి 46, భైంసా నుంచి 38, ఆదిలాబాద్ నుంచి 58, ఆసిఫాబాద్ నుంచి 66, మంచిర్యాల నుంచి 102 బస్సులు నడిపారు. వారం రోజుల పాటు 1406 ట్రిప్పులు నడుపగా..3,03,773 కిలో మీటర్లు బ స్సులు తిరిగాయి.
ఆదిలాబాద్ రీజియన్కు మేడారం జాతరకు సంబంధించి రూ.1,30,84, 938 ఆదాయం సమకూరింది. రెండేళ్లకు ఒకసారి జరిగే జాతరకు ఏటా ఆర్టీసీ అధికారులు ప్రణాళికతో సర్వీసులను నడిపిస్తున్నారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం కా వడంతో, ప్రజలు కూడా వీటి వైపే మొగ్గు చూపారు. అందుకనుగుణంగా అధికారు లు సర్వీసులు నడిపించారు.
ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో సురక్షిత ప్ర యాణం చేకూరుతుంది. మేడారం జాతరకు భక్తుల సంఖ్యను దృ ష్టిలో పెట్టుకొని రీజియన్ పరిధిలో 310 బస్సులు నడిపాం. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేశాం. దీంతో సంస్థకు రూ. కోటీ 30 లక్షల ఆదాయం సమాకూరింది. ఆదరించిన ప్రతి ప్రయాణికుడికీ కృతజ్ఞతలు. -ప్రభులత,ఆర్ఎం ఆదిలాబాద్