ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో నిర్మిస్తున్న నాగోబా ఆలయ ప్రారంభోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలని మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావుపటేల్ నిర్ణయించారు. నాగోబా దర్బార్హాల్లో ఆదివారం సాయంత్రం ఉమ్మడి జిల్లాలోని మెస్రం వంశీయులు సమావేశమ య్యారు.
డిసెంబర్ 12 నుంచి 18వ తేదీ వరకు నాగోబా ఆలయ ప్రారంభోత్సవ ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించాలని, నూతనంగా నిర్మించిన ఆలయంలో నాగోబా విగ్రహన్ని 18న ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయులు చిన్ను పటేల్, బాధిరావ్ పటేల్, కోసేరావ్, సోనేరావ్, దేవ్రావ్ పాల్గొన్నారు.
– ఇంద్రవెల్లి, డిసెంబర్ 4