తాండూర్/బెల్లంపల్లి రూరల్/కాగజ్నగర్ ఎస్పీఎం, ఫిబ్రవరి 26 : అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా సోమవారం తాం డూరు మండల పరిధిలోని రేచిని రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలోగ ల కాసిపేట రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ)ని, బెల్లంపల్లి మం డలం కన్నాల ప్రాంతంలోని రైల్వే అండర్ ప్రాసెస్ బ్రిడ్జిని, కాగజ్నగర్ మండలం శివపూర్ బారేగూడలోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల రైల్వే అధికారులు, పలువురు ప్రముఖులు పాల్గొని మాట్లాడారు. కన్నాల ప్రాంతంలోని రైల్వే అండర్ ప్రాసెస్ బ్రిడ్జిని ఎమ్మెల్యే గడ్డం వినోద్ కూడా ప్రారంభించారు.
రైల్వే శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్, ఉపన్యాస, పాటలు తదితర పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు ప్రశంసా పత్రాలతో పాటు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కాసిపేటలో ఎంపీడీవో పీ శ్రీనివాస్, రైల్వే శాఖ బెల్లంపల్లి ఏడీఈఈ (టీఆర్డీ) ముఖేశ్, ఫుడ్ కార్పొరేషన్ సభ్యుడు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పులుగం తిరుపతి, ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ కో కన్వీనర్ కొలిపాక కిరణ్ కుమార్, మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు,
రెబ్బెన జడ్పీటీసీ సంతోష్, కాసిపేట మాజీ సర్పంచ్ ఆస్ప రమేశ్, నాయకులు పాగిడి చిరంజీవి, సిద్ధం మల్లేశ్, సొల్లు లక్ష్మి, గోలెం తిరుపతి, రైల్వే అధికారులు అఫ్జల్, ప్రేమ్కుమార్, ఎంఎస్ శ్రీనివాస్, కన్నాలలో బెల్లంపల్లి మున్సిపల్ అధ్యక్షురాలు జక్కుల శ్వేత, మాజీ ఎ మ్మెల్యే అమురాజుల శ్రీదేవి, జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండి ప్రభాకర్యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు మునిమంద రమేశ్, బారేగూడలో ఆసిఫాబాద్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.