ఇచ్చోడ జూన్ 4: నిర్మల్లో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ ముక్రా కే గ్రామంపై ప్రశంసలు కురిపించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇచ్చోడ మండలం ముక్రా (కే) గ్రామంలో మొత్తం ఇండియాలోనే బ్రహ్మాండమైన ఆవార్డులు తీసుకుంటున్నదని, మనందరికీ గౌరవం తెచ్చిపెడుతున్నదని కొనియాడారు.
పల్లె ప్రగతితో ముక్రా (కే) గ్రామం దేశంలోనే ఆదర్శంగా తయారైందని తెలిపారు. ప్రతి పల్లె ముక్రా (కే)ను ఆదర్శంగా తీసుకోవాలని, గ్రామంలో లక్ష మొక్కలు నాటి వంద శాతం బతికించడం అద్భుతమని సర్పంచ్ మీనాక్షిని ఆభినందించారు. ముఖ్యమంత్రిని బోథ్ ఎమ్మెల్యే బాపురావ్, సర్పంచ్ మీనాక్షి, ఎంపీటీసీ సుభాష్ కలిశారు.