దండేపల్లి, జనవరి 4 : అభయహస్తం ప్ర జాపాలన దరఖాస్తు ప్రక్రియలో జనం వదంతులను నమ్మి ఆగమాగం అవుతున్నారు. ఐ దు గ్యారెంటీలకు ఏమేమి పత్రాలు ఇవ్వాలో అధికారుల స్పష్టత ఇచ్చినా.. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే సమాచారాన్ని పట్టుకొని ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఫలానా పత్రం లేకుంటే ప్రభుత్వం ఇచ్చే పథకాల కు అనర్హులమవుతామనే భయంతో అన్ని ప త్రాలను జత చేస్తూ.. వృథా ఖర్చులు చేస్తున్నారు.
ప్రజాపాలన దరఖాస్తులో కేవలం యజమాని ఆధార్ కార్డు, రేషన్కార్డు జిరాక్స్ పత్రా లు జత చేయాలని అధికారులు సూచించా రు. కానీ.. ఇవేవీ పట్టించుకోకుండా అందరి ఆధార్ కార్డులు, గ్యాస్, విద్యుత్ బిల్లు, పట్టాదారు పాసు పుస్తకాలు, ఉపాధిహామీ కార్డు లు, ఫించన్ సంబంధించిన పత్రాల జిరాక్స్ లు జతచేసి అందజేస్తున్నారు. ఒక్కో కు టుంబం జిరాక్స్ల కోసం రూ. 100కిపైగా ఖ ర్చు చేస్తున్నారు. జీపీ సిబ్బంది ఉచితంగా దరఖాస్తు ఫారాలు ఇంటింటికీ తిరిగి అందజేస్తున్నారు. అయితే.. కొందరు ఫారాలు నింపే అ వగాహన లేకపోవడంతో దానిని అసంపూర్తి గా నింపేసి మరో ఫారం కోసం జిరాక్స్ సెం టర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. బ్లాక్ అండ్ వైట్ అయితే రూ.20, కలర్ అయితే రూ.50 వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు.
జీవనోపాధికి ఇతర ప్రాంతాల్లో ఉంటున్న అనేక కుటుంబాలు సొంతూళ్లకు వచ్చి దరఖాస్తులు చేసుకుంటున్నాయి. ఉపాధికోసం హైదరాబాద్, ముంబాయితో పాటు ఇతర రాష్ర్టాలకు వెళ్లిన వారు కూడా ఇక్కడి పిల్లాపాపలతో వచ్చి దరఖాస్తుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి వారు రావాల్సిన అవసరం లేదు. వివరాలను గ్రామంలో తెలిసిన వారికి ఇచ్చి.. వారితో కూడా దరఖాస్తు చేయించుకునే అవకాశం ఉంది. అయినా అవగాహన లేక వేలకు వేలు బస్సు, ట్రైన్ చార్జీలు పెట్టుకొని దరఖాస్తులు అందిస్తున్నారు.