అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న రాష్ట్ర సర్కారు, ఇటీవల విడుదల చేసిన మ్యానిఫెస్టోలో మరో విప్లవాత్మక హామీనిచ్చింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే తెల్ల రేషన్కార్డులున్న కుటుంబాలన్నింటికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో సన్నన్నం పెడుతుండగా, తాజా నిర్ణయంతో గరీబోనికి కడుపునిండా భోజనం అందనున్నది. ఉమ్మడి జిల్లాలో 7.46 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరే అవకాశముండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
– మంచిర్యాల, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నేను, నాభర్త శంకర్ బుర్కపల్లిల మూడెకరాల్లో పోడు ఎవుసం చేసుకుంటున్నం. సీఎం కేసీఆర్ సారు మాకు పోడు పట్టాలు ఇచ్చిండ్రు. దీనికి రైతుబంధు కూడా ఇస్తమన్నరు. ఇగ మా రేషను కార్డుల నేను, నా భర్త, మా బిడ్డ పేరు ఉన్నది. ఇంకో ఇద్దరు చిన్న పిల్లలు, ఆల్ల పేర్లు రాలేదు. ముగ్గురికి నెలకు 18 కిలోల బియ్యం అస్తున్నది. ఇపుడు సీఎం కేసీఆర్ సారు కార్డు ఉన్నోళ్లకు సన్నబియ్యం ఇస్తమన్నరు. పిలగాండ్లు, సుట్టాల కోసం నెలకు ఐదారు కిలోలు దుకాండ్ల నుంచి రూ 50 తోని సన్నటి బియ్యం తెస్తుంటిమి. ఇప్పుడా బాధ ఉండదు.
మంచిర్యాల, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ విప్లవాత్మక హామీ ఇచ్చింది. తెల్ల రేషన్కార్డులున్న కుటుంబాలన్నింటికీ సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలకు సన్నన్నం పెడుతున్న సర్కారు, ఈ ఎన్నికల్లో గెలిస్తే రేషన్ లబ్ధిదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొంది.
అనేక మంది రేషన్ బియ్యాన్ని తినలేక ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా రేషన్ బియ్యం కొనడం, దాన్ని గుట్టుచప్పుడు కాకుండా మహారాష్ట్రకు తీసుకెళ్లి విక్రయించడం పెద్ద దందాగా మారింది. బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంతో అక్రమ దందాకు చెక్ పడనున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే పేదల ఆకలి తీరడంతో పాటు రేషన్ బియ్యం రీసైక్లింగ్ కూడా పూర్తిగా బంద్ కానున్నది. రాష్ట్రంలో 93 లక్షల కుటుంబాలుండగా, దాదాపు 3 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనున్నది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.1500 కోట్ల అదనపు భారం పడనున్నది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెల్లరేషన్ కార్డులున్న 7.46 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.
నాతో పాటు కొడుకు, కోడలు, మనవ డు ఉంటరు. నా భర్త కొన్నేండ్ల కింద చనిపోయిండు. మా రేషన్ కార్డుమీద నెలకు 18 కిలోల ఉచిత బియ్యం ఇస్తున్నరు. ఈ బియ్యమే నెలమొత్తం సరిపోతున్నయ్. సీఎం కేసీఆర్ సారు ఈ కార్డు ఉన్నోళ్లందరికీ సన్నబియ్య మే ఇస్తమని మాట ఇచ్చిండ్రు. ఇది మాకే కాదు మా గ్రామంల అందరికీ సంతోషంగా ఉంది. గీ కాలంల అందరూ సన్నబియ్యానికి అలవాటు వడ్డరు. ఎంత కంట్రోలు బియ్యం ఉన్నా సుట్టా లు అస్తే పోతే పనికస్తదని, పిలగాండ్లు తింటరని అందరి ఇండ్లళ్ల గొంచెమన్నా సన్నబి య్యం కొనుక్కుంటున్నరు. ఇపుడు సీఎం సారు మంచిగ ఆలోచనజేసి అది కట్టడి చేస్తున్నరు. ఇగ కంట్రోలు బియ్యం అమ్మేటోళ్లే ఉండరు. మా అసోంటి పేదోళ్లకు ఇగ కార్డుమీద నెలనెలా సన్నబియ్యం అస్తయి, దుకాండ్ల కిలకు రూ. 50-60 పెట్టి కొనేటి పని ఉండదు. ఇదిగాక సీఎం సారు నాలుగు వందలకే గ్యాస్ సిలిండరు ఇస్తమన్నరు. నాకు పింఛన్ కూడా వస్తున్నది. సీఎం కేసీఆర్ పేదోళ్లకు మంచిజేస్తడు.
-చెరుపుల పార్వతీబాయి, లబ్దిదారు, కరంజి(టి)
దస్తురాబాద్,అక్టోబర్ 20 : అన్నపూర్ణ పథకం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఒకే రకం బియ్యం పంపిణీ చేస్తామనడం చాలా సంతోషంగా ఉంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో సీఎం కేసీఆర్ ప్రకటించడం గొప్ప విషయం. మూడు పూటలా కడుపు నిండా పేదవాళ్లు తినాలనే లక్ష్యంతో తెచ్చిన సన్నబియ్యం పంపిణీ పథకం ఎంతో భరోసాను ఇస్తున్నది. ఇక సన్నబియ్యందుకాణాల్లో కొనే పరిస్థితి ఉండదు. గిప్పుడు సన్నబియ్యానికి క్వింటాల్కు రూ. 6 వేల కు పైగా ధర ఉంది. ఈ పథకం ప్రతి పేద కుటుంబానికి ఆర్థికంగా భరోసానిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్నది. ఇక ప్రతి పేదోడికి సన్నబియ్యంతో కడుపు నింపబోతున్నది.
-దాసరి సుధాకర్,చెన్నూర్
కుంటాల, అక్టోబర్ 20: రేషన్ షాపులో ప్రతి నెలా దొడ్డుబియ్యం తీసుకుంటున్నం. ఇప్పుడు కేసీఆర్ సారు వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే సన్నబియ్యం ఇస్తనని ప్రకటించిండు. చాలా సంతోషంగా ఉంది. దుకాణాల్లో సన్నబియ్యం కొనుక్కునే ఇబ్బంది తప్పుతది. ఇప్పుడు బియ్యం రేటు కూడా మస్తుగున్నది. పేదోళ్లు కొనే పరిస్థితే లేకుండా పోతున్నది. నాకు ఇటీవలే దవాఖానలో ఆపరేషన్ అయితే, సీఎంఆర్ఎఫ్ కింద ప్రభుత్వం ఆదుకున్నది. పేదోళ్లకు మంచి చేసేందుకే కేసీఆర్ సారు చూస్తున్నడు. గిప్పుడు కడుపు నిండా బువ్వ తినాల్నని సన్నబియ్యం ఇస్త అంటున్నడు.
-అగల్డుతి లక్ష్మి, కుంటాల
ఖానాపూర్ టౌన్, అక్టోబర్ 20: బీఆర్ఎస్ గెలిస్తే పేదలకు సన్న బియ్యం ఇస్తమని సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చడం హర్షణీయం. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీల్లో చదువుకునే పిల్లలకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్నరు. ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీ ఆర్ అనేక సంక్షమ పథకాలు ప్రవేశపెట్టిన్రు. కూలీనాలి చేసుకునే వారు సన్నబియ్యం తినాలంటే ఆర్థికంగా ఎంతో ఇబ్బంది ఉంటది. సన్నబియ్యం పంపిణీ చేస్తమని సీఎం చేసిన ప్రక టన ప్రతి ఒక్కరికీ సంతోషాన్నిస్తున్నది. మూడోసారి అయనే సీఎం కావడం పక్కా. పేదోళ్ల గుండెల్లో సీఎం కేసీఆర్ ఉంటడు.
– చుక్కల కిషన్, ఖానాపూర్
వాంకిడి, అక్టోబర్ 20 : మన సీఎం కేసీఆర్ అడుగ కున్నా అన్నీ చేస్తున్నడు. ఇప్పటికే పేదోళ్ల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిండు. మళ్లా బీఆర్ఎస్ గెలిస్తే రేషన్కార్డు ఉన్నోళ్లందరికీ సన్న బియ్యం ఇస్తమని చెప్పిండు. ఆయన ఒక్కసారి మాట ఇస్తే.. అయి తీరుతది. ఏ పార్టీ వాళ్లు వచ్చినా పట్టించు కోం. మళ్లా కారు గుర్తుకే ఓటెస్తం. కేసీఆర్నే గెలిపించుకుంటం. గాయన ఉంటేనే మా పేదోళ్లకు మేలు జరుగుతది.
– సోయం రాధాబాయి, బంబార
కుభీర్, అక్టోబర్ 20: పేద ప్రజలకు రేషన్ దుకాణా ల్లో సన్న బియ్యం అందిస్తామని సీఎం కేసీఆర్ చెప్ప డం హర్షణీయం. పేదోళ్లు కూడా సన్న బియ్యంతో భోజనం చేస్తరు. సీఎం కేసీఆర్ చెప్పిండంటే కచ్చితంగా చేస్తడు. చెప్పని పనులే ఎన్నో చేసిండు. మాకు చాలా ఆనందంగా ఉంది. పేదింటి బిడ్డలు కూడా సన్నబియ్యంతో అన్నం తినాల్నని ఆయన తలచిండు. రేషన్ దుకాణాల్లో ఇస్తున్న దొడ్డు బియ్యానికి బదులు సన్నబియ్యం ఇస్తే మంచిదే.
-దన్గరి లాలేశ్, రైతు, సాంగ్వి గ్రామం