76 రోజుల్లో రూ.1.03 కోట్లు
బాసర, జూన్ 7 : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి హుండీ ఆదాయం రికార్డుస్థాయిలో రూ.1,03,44,758 సమకూరినట్లు ఇన్చార్జి ఈవో సోమయ్య తెలిపారు.
మంగళవారం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయాధికారులు హుండీ లెక్కించారు. ఇందులో నగదు రూపంలో 1,03,44,758, మిశ్రమ బంగారం 176 గ్రాములు, మిశ్రమ వెండి 7.200 కిలోలు, విదేశీ కరెన్సీ 49 డాలర్లు సమకూరినట్లు వెల్లడించారు. ఈ మొత్తం 76 రోజుల్లో వచ్చినట్లు వివరించారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ సంజీవ్రావు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.