నిర్మల్, (నమస్తే తెలంగాణ)/బోథ్/ఉట్నూర్, సెప్టెంబర్ 11 : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో వానలు దంచి కొడుతున్నాయి. బంగాళా ఖాతం లో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కుండపోత వర్షం కురుస్తుండడంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నిర్మల్ జిల్లా కుంటాలలోని ఓలా, మెదన్పూర్, అంబకంటి, సూర్యాపూర్ గ్రామాల్లో పంటలు నీట మునిగా యి. ఓలా వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పాత వెంకూర్ గ్రామానికి రాకపోకలు నిలిచిపో యాయి. అలాగే ఖానాపూర్ మండలంలోని రెంకోని వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఖానాపూర్-తర్లపాడ్, ఖానాపూర్-దిలావర్పూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మ ల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై ఖానాపూర్ శివారులో భారీ వృక్షం నేలకొరిగింది. అదే సమ యంలో నిర్మల్ నుంచి ఖానాపూర్ వైపు వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనంపై చెట్టు విరిగిపడింది. దీంతో టాటా మ్యాజిక్ డ్రైవర్తోపాటు ఓ ప్రయా ణికుడు మృతి చెందాడు. మరో ప్రయాణికుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో ఉరుములు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. గుడిహత్నూర్, నేరడి గొండ, ఇంద్రవెల్లి, ఉట్నూర్ తదితర మండలాల్లో వర్షంతో జనజీవనం స్తంభించింది.
ప్రాజెక్టులకు పెరిగిన ఇన్ఫ్లో..
నిర్మల్ జిల్లాలోని కడెం, గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున ఇన్ఫ్లో వచ్చి చేరుతు న్నది. ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా 694.67 అడుగుల వద్ద నీటిని నిల్వ ఉంచి 8 క్రస్ట్ గేట్ల ద్వారా 68246 క్యూసె క్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు 2250 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా ఒక గేటు ఎత్తి అదే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. అలాగే స్వర్ణ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ఒక గేటు ను ఎత్తి దిగువకు 3300 క్యూసెక్కుల నీటిని విడు దల చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నా ల ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు గేటు ఎత్తి కిందికి నీటిని విడుదల చేస్తు న్నారు. ప్రాజెక్టులోకి 1200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుం డడంతో 1300 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. వడ్డాడి మత్తడివాగు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి దిగువనకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 12వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండ గా అదే మొత్తంలో విడుదల చేస్తున్నారు.
అత్యధికంగా లక్ష్మణచాందలో ..
ఇదిలా ఉంటే నిర్మల్ జిల్లాలో సగటు వర్షపా తం 44.5మిల్లీ మీటర్లుగా నమోదైంది. అత్యధి కంగా లక్ష్మణచాంద మండలంలో 81.2 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే కుభీర్లో 22.4, తానూర్లో 12.4, బాసరలో 50.5, ముథోల్లో 18.8, భైంసాలో 35.4, కుంటాలలో 19.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే నర్సా పూర్(జీ)లో 43.5, లోకేశ్వరంలో 40.2, దిలా వర్పూర్లో 55.2, సారంగాపూర్లో 61.4, నిర్మల్లో 48.4, నిర్మల్ రూరల్లో 38.9, సోన్లో 13.8, మామడలో 60.2, పెంబిలో 71.5, ఖానాపూర్లో 61.4, కడెంలో 48.8, దస్తురాబాద్ మండలంలో 61 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.