ఎదులాపురం, డిసెంబర్ 26 : దేశంలో బీఎఫ్.7 వైరస్ వ్యాప్తి చెందిందని వైద్యాధికారులు అప్రమత్తంగా ఉంటూ చికిత్సకు కావాల్సిన పరికరాలు, వెంటిలేటర్, ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉంచుకోవాలని హెల్త్ సెక్రటరీ రిజ్వీ సూచించారు. హైదరాబాద్ నుంచి కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్వేతామహంతి, డీఎంఈ రమేశ్ రెడ్డి, డీహెచ్ గడ ల శ్రీనివాస్, టీవీవీపీ కమిషనర్ అజయ్తో కలిసి డైరెక్టర్లు, డీఎంహెచ్వోలు డీవైఎస్వోలు, ఇతర వైద్యులుతో సోమవారం జూమ్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రిమ్స్, పీహెచ్సీల్లో మందులు, వెంటిలేటర్ పడక, ఆక్సిజన్ పడకలు, మాస్క్లు, శిక్షణ పొందిన వైద్యసిబ్బంది ఎంత మంది ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. మంగళవారం రిమ్స్ లో మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించారు. వీడియోకాన్ఫరెన్స్లో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, రిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ అశోక్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, డీఎస్వో వైసీ.శ్రీనివాస్, వైద్యులు సైతం సుమలత, ప్రశాంత్, సందీప్జాదవ్ తదితరులు ఉన్నారు.