బెజ్జూర్, జనవరి 3 : సామాజిక అభివృద్ధికి పాటుపడి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతులుగా తమ సామా జిక వర్గ అభ్యున్నతికి అహర్నిశలు కృషిచేసి జీవితాలనే సమాజానికి అంకింతం చేసిన ఫూలే దంపతుల చరిత్రను పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని మాలీ సంఘం జాతీయ అధ్యక్షుడు పెట్కులె సుకుమార్ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం మాలీ సంఘం ఆధ్వ ర్యంలో నిర్వహించిన క్రాంతి జ్యోతి సావిత్రిబాఫూలే జయంతి వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజర య్యా రు. అంతకుముందు మాలీ సంఘం వారి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని గాంధీ చౌక్లోని మాలీసంఘం భవనం నుంచి సబ్ స్టేషన్ సమీపంలోని ఫూలే దంపతుల విగ్రహాల వరకు భార్యీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం మండలాధ్యక్షుడు ఆదె అశోక్ మాలీ సంఘం జెండాను ఎగుర వేశారు. అనంతరం నాయకులు ఫూలే దంపతుల విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జాతీయ అధ్యక్షుడు మాట్లాడు తూ, మాలి కులస్తులు సమాజికంగా, ఆర్థికంగా, రాజకీ య పరంగా అన్ని రంగాల్లో ముందుకు సాగాలంటే అందరూ చదువుకోవాలని సూచించారు. కస్తుర్బాగాంధీ గురుకులాలకు సావిత్రి ఫూలే గురుకుల విద్యాలయాలుగా పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
23 ఏళ్లుగా పోరాడుతున్న తమ సామాజిక వర్గాన్ని ఎస్టీ హోదాను కల్పించాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రగతి భవన్కు జ్యోతిభాఫూలే పురు పెట్టినందుకు మాలి సామాజిక వర్గం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు సుకుమార్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురె శ్యాంరావును మండల మాలీ సంఘం వారు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుర్నులే మెంగాజి, జిల్లా ప్రధాన కార్యదర్శి గౌత్రె గోపాల్, జిల్లా ఉపాధ్యక్షుడు కొట్రంగి రామకృష్ణ, మండలాధ్యక్షుడు ఆదే అశోక్, ఉపాధ్యక్షుడు సెండె బాబురావు, మండల నాయకులు, గ్రామ సంఘాల అధ్యక్షులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, జనవరి3 : మహిళలకు అదర్శ ప్రాయురాలు సావిత్రీబాయి ఫూలే అని మాలీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగోషే శంకర్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ క్రాస్ రోడ్డు వద్ద మహాత్మాజ్యోతిరావుపూలే చౌక్ వద్ద భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళ అంటే ఇంటికే పరిమితం కాదని సమాజహితం కోసం కూడా పాటుపడుతుందని నిరూపించిన మహనీయురాలని కొనియాడారు. నేటి మహిళలు సావిత్రిబాయి ఫూలేను ఆదర్శంగా తీసుకోని అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవ్రావు, నా యకులు తిరుపతి, సోమయ్య పాల్గొన్నారు.
వాంకిడి,జనవరి 3: స్త్రీ విద్యకు నాంది పలికిన భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే సేవలు చిరస్మరణీయమని మాలీ సంఘం మండలాధ్యక్షుడు వాడై బాబురావు అన్నారు. బుధవారం సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని మాలీ సంక్షేమ సంఘం కార్యాలయ ఆవరణలో ఫూలే దంపతుల విగ్రహాలకు సంఘం నాయకులతో కలిసి కొవ్వొత్తులు వెలిగించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాలీ సంఘం మండల ప్రధాన కార్యదర్శి శేండే వాసు,మాలి సంఘం ఉపాధ్యక్షుడు సోనూర్లే రగురం, మా లి సంఘం మండల కోశాధికారి బెండరే కృష్ణ జీ, ప్రచార కార్యదర్శి సెండే సుధాకర్, యువజన మండలాధ్యక్షుడు మొహార్లే అశోక్, జిల్లా సంయుక్త కార్యదర్శి శంకర్ పాల్గొన్నారు.
రెబ్బెన, జనవరి 3: ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పరితపించిన అక్షరజ్యోతి, సమాజంలో రుగ్మతలను రూపుమాపడం కోసం విశేష కృషి చేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలేను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఆమె అడుగుజాడల్లో నడవాలని రెబ్బెన ఎంపీడీవో పరికిపండ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, పలు గ్రామాల్లో బుధవారం సావిత్రిబాయిపూలే విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాల వేసి ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వడై మాధవి, వడై శాంత, శ్యాంరావు, ఉపసర్పంచ్ మాధవి, లేతన్గూడ హెచ్ఎం దొడ్డిపట్ల రవికుమార్, ఉపాధ్యాయులు మనోహర్, సాయిక్రిష్ణ పలువురు ఉన్నారు.
గోలేటిటౌన్షిప్ బస్టాండ్ వద్ద భగత్యూత్ ఆధ్వర్యంలో జ్ఞానజ్యోతి చదువుల తల్లి భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయురా లు సావిత్రిబాయిపూలే జయంతిని ఘనంగా నిర్వహించినట్లు భగత్యూత్ అధ్యక్షుడు కేసరి కిషన్గౌడ్ పెర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మద్దెల సురేందర్రాజు, వివిధ పార్టీల నాయకులు దాసరి సాం బగౌడ్, నామాల సుధాకర్, డాక్టర్ మనోహర్రెడ్డి, కొట రాజయ్య, తోట తిరుపతి, సాగర్, యాదగిరి లతో పాటు పలువురు ఉన్నారు.
కాగజ్నగర్, జనవరి 3 : కాగజ్నగర్ మం డలంలోని రాస్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి ప్రధానోపాధ్యాయుడు ఏటూకూరి శ్రీనివాస్, విద్యార్థులు పూలమాల వేసి నివాళులర్పించారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం కాగజ్నగర్ సెక్టర్ అధ్యక్షుడు జయదేవ్ ఆధ్వర్యంలో మండలంలోని కోసినిలోని సావిత్రి బాయి ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పట్టణంలోని పెట్రోల్ పంపు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో సావిత్రిబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించి ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు శివప్రసాద్, మూర్తి, నర్సయ్య, సుభాశ్, తాజోద్దిన్, పురుషోత్తం, ప్రధానోపాధ్యాయుడు వెంకట్ రాజయ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గోన్నారు.
కెరమెరి, జనవరి 3: సావిత్రబాయి ఫూల్లే జయంతిని మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాలీ సంక్షేమ సంఘం నాయకులు మహాత్మా జ్యోతిబాఫూల్లే, సావిత్రిబాయి దంపతుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ మాలీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే, మాలీ సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు కావుడే తులసీరాం, నాయకులు ఆదే శౠ్యంరావ్, కోట్రంగే తిరుపతి, సెండే నారాయణ తదితరులు పాల్గొన్నారు.
కౌటాల, జనవరి 3 : మండల కేంద్రంలో బుధవారం విద్యార్థులు, మాలీ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిబాఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే చిత్రపటాలతో మండల కేంద్రంలోని ప్రధాన వీధు ల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఫూలే దంపతుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి ఫూలే సమాజానికి చేసిన సేవలను కొనియాడారు.
జైనూర్, జనవరి 3 : మండల కేంద్రంలోని జ్యోతిబాఫూలే విగ్రహం వద్ద మాలీ సంఘం, డా.బీఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డా. బీఆర్ అంబేదర్ యువజన సంఘం మండలాధ్యక్షుడు సోన్కాంబ్లే సిద్ధార్థ్ సావిత్రి బాయి ఫూలే సేవలను కొనియాడారు. ఈకార్యక్రమంలో పెట్కులె, రమాకాంత్ డా.బీఆర్ అం బేదర్ యువజన సంఘం మండలాధ్యక్షుడు సోన్కాంబ్లే సిద్ధార్థ్, నాయకులు ఘటనాకర్, నిఖిల్, సూరజ్, కాంబ్లే అశోక్ పాల్గొన్నారు.
పెంచికల్ పేట్, జనవరి 3: మహిళా విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే అని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ నిర్మల పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఘనంగా సావిత్రి బాయి పూలే జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే ఉద్య మ పోరాటాన్ని విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా మండలంలోని పలు కార్యాలయాల్లో జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయు లు యాదగిరి, బడే సాబ్,సుజాత,లక్ష్మి,నగేశ్, భారతి, శ్రీధర్, విజయ్, రమాదేవి, సాదియా, సాయి తేజ, విద్యార్థులు పాల్గొన్నారు.
దహెగాం, జనవరి3 : భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, గొప్ప సంఘ సంస్కకర్త సావిత్రిబాయి ఫూలే జయంతిని కస్తూర్భా గురుకుల విద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా సావిత్రిబాయి ఫూలే గొప్ప ఆదర్శమూర్తి అని కొనియాడారు.ఆమె జీవిత విశేషాలను వివరించారు. ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో ఎస్వో రిజ్వాన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.