ఎదులాపురం, జూలై4 : బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలోని జనార్దన్ రెడ్డి గార్డెన్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జై తెలంగాణ, జై జోగు రామన్న అంటూ కార్యకర్తలు, అభిమానులు నినదించారు. నియోజవర్గంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలతో కోలాహలంగా మారింది. తమ అభిమాన నాయకుడికి భారీ గజమాలలతో సత్కరించారు. భారీ కేక్ కట్ చేయించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే రామన్న మహారాష్ట్రలో పలుమార్లు పర్యటించగా అక్కడి నుంచి కూడా నాయకులు వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ ఎంపీ గొడం నగేశ్, నేరడిగొండ జడ్పీటీసీ అనిల్ జాదవ్, తాంసి జడ్పీటీసీ తాట్లి పెల్లిరాజు, బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, ప్రముఖ న్యాయవాది కేమ శ్రీకాంత్, ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, రిమ్స్ సూపరింటెండెంట్ అశోక్, డీఆర్డీఏ కిషన్, డీఎస్సీడీవో భగత్ సునీత, రాజలింగం, టీఎన్జీవ్సో జిల్లా అధ్యక్షప్రధాన కార్యదర్శులు సంద అశోక్, ఎడ్ల నవీన్ కుమార్, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, వివిధ శాఖల అధికారులు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అలాల్ అజయ్, సాయిని రవికుమార్, మహమ్మద్ అత్తరుల్లా, మెట్టు ప్రహ్లాద్, యూనిస్ అక్బానీ, అష్రఫ్, సాజిదొద్దీన్లతో పాటు పట్టణ కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, పార్టీ నేత లు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
తుది శ్వాస వరకు ప్రజా సేవకే అంకితం : ఎమ్మెల్యే జోగు రామన్న తుది శ్వాస వరకు ప్రజా సేవకు అంకితమవుతానని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. అభిమానంతో శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నకు సీఎం కేసీఆర్ ఉత్తరం ద్వారా శుభాకాంక్షలు తెలుపడంతో పాటు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.