ఎదులాపురం/నిర్మల్ టౌన్, జూన్ 5 : మహాత్మా జ్యోతి బాఫూలే ఇంటర్మీడియట్, డిగ్రీ గురుకులంలో ప్రవేశాలకు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని అదనపు కలెక్టర్లు ఎన్ నటరాజ్, రాంబాబు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 కళాశాలల్లో ప్రవేశానికి ఆదిలాబాద్లో 4, నిర్మల్లో 9, మంచిర్యాలలో 6, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
5,204 మందికి గాను 4,478 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. 726 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగింది. మొత్తంగా 7 డిగ్రీ, 12 ఇంటర్మీడియట్ కళాశాలలు ఉన్నాయని వెల్లడించారు. పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్లు పరిశీలించారు. వారి వెంట ఉమ్మడి జిల్లా బీసీ గురుకులం ఆర్సీవో గోపిచంద్ రాథోడ్, నిర్మల్ కన్వీనర్ సంతోష్ ఉన్నారు.