దండేపల్లి, డిసెంబర్27 : గూడెం అభినవ శబరిమలై అయ్యప్ప ఆలయంలో బుధవారం మహా మండల పూజ మహోత్సవాన్నీ అత్యంత వైభవంగా నిర్వహించారు. గురుస్వామి చక్రవర్తుల పురుషోత్తమాచార్యుల ఆధ్వర్యంలో గురుస్వాములు దివ్యపదునెట్టాంబడి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పద్దెనిమిది మెట్లను పూలతో అందంగా అలంకరించారు.
అష్టోత్తర శతకలశాభిషేకం, మహాపడిపూజ, అభిషేకాలు, కుంకుమార్చనలు, స్వామివారికి పుష్పాభిషేకం, పంచామృతాభిషేకాలునిర్వహించారు.స్వామియే శరణం అయ్యప్ప అంటూ స్వాములు ఆధ్యాత్మిక గీతాలు ఆలపించారు. గురుస్వాముల మంత్రోచ్ఛారణాల మధ్య అయ్యప్ప శరణుఘోషతో ఆలయ ప్రాంతం మార్మోగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో గుట్ట ప్రాంతం సందడిగా మారింది.