హాజీపూర్, ఆగస్టు 12 : ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషి చేస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. హాజీపూర్ మండలంలోని కొండాపూర్, దొనబండ, బుద్ధిపల్లి గ్రామాల్లోని పంట పొలాల్లో భారీగా ఇసుక మేటలు వేయగా శుక్రవారం సర్పంచ్లు జాడి సత్యం, అన్నం మధుసూదన్ రెడ్డి, రైతులతో కలిసి ఆ భూములను ఎమ్మెల్యే పరిశీలించారు. కడెం డిస్ట్రిబ్యూటరీ నంబర్ 42 ద్వారా దొనబండ గ్రామ చెరువులోకి వచ్చే కాలువ పూర్తిగా తెగిపొయి దాదాపు 60 ఎకరాల్లో ఇసుక మేటలను వేయడంతో రైతులు పంటలు నష్టపోయారు. కడెం ప్రాజెక్టు డీఈతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
దొనబండ, పెద్దంపేట గ్రామాల విద్యుత్ లైన్మన్ శ్రీనివాస్ రైతులతో అసభ్యకరంగా మాట్లాడుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తక్షణమే అతనిని తొలగించాలని, వంతెనకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే వెంట ఎంపీటీసీ వెంకటేశ్, నాయకులు బేతు రవి, అల్లంల నాగయ్య, భూషణవేణి బాపన్న, ముక్కెర తిరుపతి, ముత్యాల కుమార్, అంబటయ్య, నక్క కొమురయ్య పాల్గొన్నారు.