ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం
నార్నూర్, జూన్ 23 : ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ముం దుకు సాగుతున్నదని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని గుండాల ఎస్సీగూడలో మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. పాఠశాల మరమ్మతుకు భూమి చేశారు. ‘మన ఊరు-మన బడి’ కింద రూ.44.67 లక్షలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఈ నిధులతో పాఠశాలలో సకల వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలు సమస్యలు జడ్పీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆసిఫాబాద్ ఎమ్మె ల్యే ఆత్రం సక్కు సహకారంతో పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఆయ న హామీనిచ్చారు. అంతకుముందు గుండాల గోండుగూడలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు.
అంగన్వాడీ టీచర్ను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఎంపల్లి గ్రామాన్ని సందర్శించారు. పక్షం రోజుల క్రితం జాదవ్ అరవింద్ మృతి చెందగా.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్పంచులు కనక సేవంత ప్రభాకర్, రాథోడ్ గోవింద్నాయక్, ఉప సర్పంచ్ కాంబ్లే సుభాష్, కో ఆప్షన్ సభ్యుడు షేక్ దస్తగిరి, ప్రధానోపాధ్యాయుడు ప్రమోద్, ఆడ శ్రీరామ్, మెస్రం మానిక్రావ్, దావుల రమేశ్, కాంబ్లే నరహరి, కాంబ్లే భీందాస్, సురేశ్, మాజీ సర్పంచ్ మెస్రం దాదారావ్, గ్రామస్తులు పాల్గొన్నారు.