నిర్మల్ అర్బన్, అక్టోబర్ 14 : ప్రభుత్వ జూనియర్ కళాశాలల కాంట్రాక్ట్ అధ్యాపకులకు సంబంధించిన రెండు నెలల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఒక్కో కాంట్రాక్టు అధ్యాపకుడికి రూ.54,220 చొప్పున రూ.1,08,440 తమ ఖాతాల్లో జమచేసింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో మొత్తం 466 మంది కాంట్రాక్టు అధ్యాపకులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరందరికీ రెండు నెలలకు గాను రూ.5కోట్ల 5 లక్షల 33 వేల 40 జమ చేసింది.