నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 8 ;గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగులకు(సెర్ప్) సర్కారు తీపికబురు అందించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 539 మంది ఉండగా.. ఇందులో నిర్మల్లో 117, ఆదిలాబాద్లో 154, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 149, మంచిర్యాలలో 119 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వారి సేవలను గుర్తించిన ప్రభుత్వం పేస్కేల్ను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం తాజాగా ప్రకటించిన బడ్జెట్లో రూ.192 కోట్లు కూడా కేటాయించింది. మహిళా సంఘాలు ఏర్పాటు చేయడం, పొదుపు పాటించడం, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, కుటీర పరిశ్రమలు నెలకొల్పడం, ఆర్థిక అసమానతలను తొలగించడం వంటి కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.
2001లో అప్పటి ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థను ఏర్పాటు చేసింది. అందులో పనిచేసే వారిని సెర్ప్ ఉద్యోగులుగా ప్రకటించింది. వీరికి ప్రభుత్వం కేడర్ను బట్టి కొంత గౌరవ వేతనాన్ని ఇస్తున్నది. అయితే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా తమకు ఉద్యోగ భద్రత, పే స్కేలు, హెచ్ఆర్ఏ, డీఏలను అమలు చేయాలని కోరుతున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుం చే పోరాటం చేస్తున్నారు. వారి సమస్యలను గు ర్తించిన సీఎం కేసీఆర్.. తప్పకుండా గౌరవం క ల్పిస్తామని అనేకమార్లు ప్రకటించారు. తాజాగా బడ్జెట్లో పే స్కేలును అమలు చేస్తూ, అందుకు అవసరమైన నిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్రావు ప్రతిపాదించారు. ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని ప్రకటించడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 539 మంది సెర్ప్ ఉద్యోగులకు ప్రయోజనం కలుగనున్నది.
నిర్మల్లో 117, ఆదిలాబాద్లో 154, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 149, మంచిర్యాలలో 119 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరు గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలను ఏర్పాటు చేసి, పొదుపు పాటించడం, మహిళా సంఘాలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేయడం, పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమర్ధతను తొలగించడం వంటి కార్యక్రమాల్లో సెర్ప్ ఉద్యోగులు కీలక పాత్ర పోశిస్తున్నారు. దీంతో ప్రభుత్వం పే స్కేలు అమలు చేయనున్నది. ప్రస్తుతం పే స్కేలులో ఏపీడీలు, ఏపీఎంలు, డీపీఎంలు, సీసీలు ఉండడంతో వీరందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలు పెరగనున్నాయి. డీఏ వంటి సౌకర్యాలు అందే అవకాశం ఉంది. దీంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వోద్యోగులతో సమానంగా..
ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మమ్మల్ని కూడా ఉద్యోగులుగా గుర్తించాలని ఎన్నోసార్లు గత ప్రభుత్వాలకు విన్నవించాం. ప్రస్తుతం మాకు గౌరవ వేతనం ఇస్తున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగినట్లు మాకు పెరిగేది కాదు. ఇప్పుడు పే స్కేల్ అమలైతే ప్రభుత్వ నిబంధనల మేరకు ఉద్యోగులకు ఎప్పుడు వేతనాలు పెరిగినా మాకూ పెరుగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న సెర్ప్ ఉద్యోగులకు డీఏ, ఇతర అలవెన్సులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– నర్సయ్య, సెర్ప్ ఉద్యోగి, నిర్మల్
ప్రభుత్వ నిర్ణయం హర్షదాయకం..
సెర్ఫ్ ఉద్యోగులకు ప్రభుత్వం పే స్కేల్ను ఏప్రిల్ నుంచి అమలు చేసేందుకు రాష్ట్ర బడ్జెట్లో రూ.192 కోట్లు ప్రతిపాదించడం చాలా సంతోషంగా ఉంది. 2001 నుంచి చాలీచాలని వేతనాలతో పని చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం అంకితభావంతో పని చేస్తున్న మా సేవలను సీఎం కేసీఆర్ సార్ తప్పకుండా గుర్తిస్తారన్న నమ్మకంతో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేశాం. అందుకే ప్రభుత్వం మాకు ఏప్రిల్ 1 నుంచి పే స్కేల్ను అమలు చేస్తామని ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా డీఏ సౌకర్యం అందుతుంది.
– డీ గంగారెడ్డి, జేఏసీ కన్వీనర్, నిర్మల్
ఉద్యోగుల పక్షపాతిగా..
ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఏ నిర్ణయం తీసుకున్నా బాగుంటుంది. ఉద్యోగుల కష్టాలను గుర్తించడంలో కూడా ముందుంటారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో సెర్ఫ్ ఉద్యోగుల పాత్ర ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్నది. దీంతో మాకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పే స్కేల్ను అమలు చేస్తే మా కష్టాలన్నీ తీరిపోతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలపై ఎన్నోసార్లు పోరాడాం. అయినా మాకు న్యాయం జరగలేదు. కానీ సీఎం కేసీఆర్ సార్ మమల్ని గుర్తించి, పే స్కేల్ అమలుకు అంగీకరించారు. చాలా సంతోషంగా ఉంది.
– రేఖ, ఐకేపీ సీఏ, నిర్మల్