నిర్మల్ అర్బన్, జనవరి 28 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ఎజెండాగా పెద్ద ఎత్తున అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు ప్రజల్లో చేరేలా చూడాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సోషల్ మీడియా నిర్వాహకులకు సూచించారు. బీఆర్ఎస్ పార్టీ ఐటీ సెల్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన అఖిల్ రెబల్, ఉపాధ్యక్షుడిగా ఎన్నికలైన రిజ్వాన్ఖాన్, మైనార్టీ జనరల్ సెక్రటరీ నజీర్ఖాన్, తదితరులు శనివారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. వారితో మంత్రి మాట్లాడుతూ.. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. జిల్లాలో ఐటీ సెల్ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు మంత్రికి తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి రాంకిషన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్రెడ్డి పాల్గొన్నారు.