ఎదులాపురం, ఫిబ్రవరి 8 : కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ దవాఖానలో తెలంగాణ ప్రభు త్వం వైద్య సేవలు అందిస్తున్నదని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. రిమ్స్ దవాఖానను కలెక్టర్ సందర్శించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రిమ్స్ సూపర్ స్పెషాలిటీలో అత్యాధునిక వైద్య పరికరాలు, నిష్ణాతులైన అనుభవం కలిగిన వైద్య బృందం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని రోగులు రిమ్స్కు వైద్య చికిత్సల కోసం వస్తుంటారని తెలిపారు. రోగులకు మెరుగైన వైద్యం అంది స్తూ ఒక అసెట్లాగా రిమ్స్ జిల్లా లో కలిగి ఉండడం అదృష్టమని పేర్కొ న్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అవసరమైన సౌకర్యాలు అందించడానికి ముందుకు వస్తు న్నారని తెలిపారు. అత్యవసర వైద్య సేవలందిస్తూ జిల్లా ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా సిబ్బంది కృషి చేయాలని సూచించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఆపరేషన్ థియేటర్లను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం రిమ్స్లో పలు విభాగాలు, ఐసీయూ, ప్రసూతి వార్డులను పరిశీలించారు. సిబ్బంది అత్యుత్తమ సేవలందించాలన్నారు. కార్యక్ర మంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డాక్టర్లు తిప్పా స్వామి, ఇద్రీస్ అక్బానీ, దేవిదాస్ ఇతర వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.