నిర్మల్అర్బన్, సెప్టెంబర్ 1 : అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్లోని గాజుల్పేట ఫంక్షన్హాల్లో గురవారం 20, 21, 35వార్డుల లబ్ధిదారులకు ఆసరా కొత్త పింఛన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మల్ పట్టణంలో 13,577 పాత పింఛన్లు ఉండగా కొత్తగా 1455 మంది లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ మంజూరు చేశారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని అన్నారు. నిర్మల్లో ముస్లింలకు హజ్ హౌస్, షాదీఖానా, ఈద్గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ రాజేందర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, నాయకులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఆసరాతో అందరికీ భరోసా
సోన్, సెప్టెంబర్ 1 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆసరాతో అందరికీ భరోసా కలుగుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ మండలంలోని ఎల్లపల్లి, కొండాపూర్ గ్రామాల్లో లబ్ధిదారులకు పింఛన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 57ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తామంటూ పేదలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేరుతుందని అన్నారు. జిల్లాలో కొత్తగా 19500 మందికి ఆసరా పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీచైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, ఆర్డీవో తుకారాం, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, సర్పంచ్లు రవీందర్రెడ్డి, నవాత్ గంగాధర్, తహసీల్దార్ ప్రభాకర్, ప్రముఖ పారిశ్రామిక వేత్త అల్లోల మురళీధర్రెడ్డి, నాయకులు సురేందర్రెడ్డి, విలాస్, సాయన్న, భూమేశ్, భూమయ్య, శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.