ఎనిమిదో విడుతకు అంతా సిద్ధం
సాగు సమయంలో సర్కారు భరోసా
హర్షం వ్యక్తం చేస్తున్న ఉమ్మడి జిల్లా రైతాంగం
నిర్మల్ టౌన్/తాంసి, డిసెంబర్ 26 :రైతుబంధు.. రైతన్నల పాలిట ఆత్మబంధువుగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎవుసం చేయాలంటే పెట్టుబడి డబ్బులకు అరిగోస పడేది. ఎడ్లు, బర్లు, నగలు, స్తిరాస్తులు అమ్ముకోవాల్సి వచ్చేది. కర్షకుల కష్టాలను గుర్తించిన కేసీఆర్ సీఎం రైతుబంధు పేరిట యేడాదికి రూ.10వేల పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నాడు. ఇప్పటివరకు ఏడు విడుతలు ఇవ్వగా.. ఎనిమిదో విడుతకు సమయం ఆసన్నమైంది.. రేపటి(మంగళవారం) నుంచి అర్హులైన రైతుల ఖాతాల్లో పది రోజులపాటు డబ్బులు జమ చేయనున్నారు. ఈ యాసంగికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 5,92,241 మంది రైతులకు ప్రభుత్వం రూ.874.01 కోట్లను పంపిణీ చేయనున్నది. గుంట భూమి ఉన్నా రైతుబంధు ఇస్తామని సర్కారు ప్రకటించడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా రైతుల పరిస్థితి అధ్వానంగా ఉండేది. యేటా పంట సీజన్ ప్రారంభమైందంటే పెట్టుబడి కో సం తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఉమ్మడి జిల్లాలో పేద రైతులు అధిక సంఖ్యలో ఉండడంతో పెట్టుబడి డబ్బుల కోసం వడ్డీ వ్యాపారులు, దళారులు, బ్యాంకుల చుట్టూ తిరుగాల్సి వచ్చేది. బ్యాంకు అధికారులు రుణాల పంపిణీలో తీవ్ర జాప్యం చేసేవారు. వివిధ పంటలు వేసే రై తులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పద్ధతి పాటించకుండా త క్కువ రుణాలు ఇచ్చేవారు. వ్యవసాయ పనులు ప్రారంభమైనా విత్తనాలు, ఎరువులకు డబ్బులు లేక బ్యాంకు అధికారుల చుట్టూ తిరుగాల్సి వచ్చేది. పట్టా పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్లు తేవాలంటూ బ్యాంకు అధికారులు సూచించేవారు. బ్యాంకు రుణాలు లభించక పోవడం తో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేవారు. వ్యాపారులు బంగారం, పట్టాపాసు పుస్తకాలు, ఇతర వస్తువులు త నఖా పెట్టుకొని రుణాలు ఇచ్చి అధిక వడ్డీలు వసూలు చేసేవారు. రోజులు గడుస్తున్నా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయని రైతులు చివరకు దళారులను ఆశ్రయించేవారు. దళారులు నకిలీ విత్తనాలు, ఎరువులను రైతులకు అంటగట్టి దిగుబడి రాగానే తమకు మాత్రమే పంటలు విక్రయించాలని షరతు విధించేవారు. విత్తనా లు, ఎరువులకు అసలు, వడ్డీ జమ కట్టి పంట విక్రయించగా వచ్చిన డబ్బులు దళారులే తీసుకునే వారు. దీం తో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది.
రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతులకు పెట్టుబడి సాయం అందించాలని భావించారు. ఇందుకు అనుగుణంగా మే 10, 2018న రైతుబంధు పేరిట పథకాన్ని ప్రారంభించారు. మొదటి విడుతగా ఎకరానికి రూ.4వేల చొ ప్పున.. యేడాదికి రెండు దఫాలుగా రూ.8 వేలు చెల్లించారు. మొదటి విడుతలో చెక్కుల ద్వారా సాయం అం దించగా.. 2018 డిసెంబర్లో యాసంగి నుంచి రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నారు. 2018 జరిగిన ఎన్నికల హామీలో భాగంగా సాయాన్ని ఎకరానికి రూ.5 వేల చొప్పున ఏడాదికి రెండు దఫాలుగా రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. 2019-20 వానకాలం నుంచి పెంచిన పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. 2018-19లో వానకాలం, యాసంగికి రెండు విడుతలుగా రూ.4 వేల చొప్పున ఇవ్వగా.. తర్వాత ఎకరానికి రూ.5 వేల చొప్పున వానకాలం, యాసంగి రెండు విడుతల్లో ఇచ్చారు. 2020-21 సంవత్సరానికి కూడా డబ్బులు జమ చేశారు. ప్రస్తుతం యాసంగి పంట పెట్టుబడికి రేపటి(మంగళవారం) నుంచి డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయనుండడంతో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ సర్కారు ఇప్పటివరకు ఏడు విడుతలుగా రైతుబంధు వేయగా.. ప్రస్తుత పంపిణీతో ఎనిమిదో విడుతకు సన్నద్ధం అవుతున్నది.
5,92,241 మంది రైతులకు రూ.874.01 కోట్లు
ఈ యాసంగికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 5,92, 241 మంది రైతులకు ప్రభుత్వం రూ.874.01 కోట్లను పంపిణీ చేస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో 1,47,026 మంది రైతులకు రూ.276.44 కోట్లు, నిర్మల్ జిల్లాలోని 1,78,535 మందికి రూ.226.23 కోట్లు, మంచిర్యాల జిల్లాలోని 1,47,541 మందికి రూ.169.75 కోట్లు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 1,19,139 మంది కి రూ.201.59 కోట్ల సాయం అందనుంది. మంగళవారం నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం డబ్బులు జమకానున్నాయి. సీజన్ ప్రారంభంలోనే సర్కారు అందిస్తున్న సాయం చేతికి రానుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ యే డాది కొత్తగా పాస్బుక్లు పొందిన రైతులు, కొత్తగా ధర ణి రికార్డుల్లో నమోదైన రైతులు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవటానికి ప్రభుత్వం అవకాశం కల్పించిం ది. దీంతో క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) రైతుల నుంచి వివరాలను సేకరించి, ఆన్లైన్లో పొందుపరిచారు. గుంట భూమి ఉన్న రైతులకు కూడా డబ్బులు జమచేయనున్నారు.