భైంసా టౌన్, డిసెంబర్ 27 :ప్రతి ఊరిలో క్రీడా ప్రాంగణాలకు స్థలాలు కూడా కేటాయించిన సర్కారు.. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడల బలోపేతానికి కసరత్తు చేస్తున్నది. విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు క్రీడా నిధిని ఏర్పాటు చేస్తున్నది. ఇందులో నుంచి ప్రతి ప్రాథమిక పాఠశాలకు రూ.5వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల లకు రూ.10 వేల చొప్పున మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3,698 బడులు ఉండగా.. రూ.2.45 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులు నేరుగా పాఠశాల యాజమాన్య కమిటీ ఖాతాల్లో జమ కాగా.. క్రీడా పరికరాలు కొనుగోలు చేయనున్నారు. – భైంసా టౌన్, డిసెంబర్ 27
ప్రభుత్వం సర్కారు పాఠశాలల్లో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తుండగా.. విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు క్రీడా నిధిని కూడా ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ప్రాథమిక పాఠశాలకు రూ.5వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ.10 వేల చొప్పున మంజూరు చేసింది. నేరుగా పాఠశాల యాజమాన్య కమిటీ ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఈ నిధులతో క్రీడా పరికరాలు మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఈ నిధుల రాకతో పాఠశాలల్లో క్రీడా సా మగ్రి కొరత తీరనున్నది. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడానికి, మానసికంగా ఎదగడానికి, శా రీరకంగా, దృఢంగా ఉండేందుకు, రక్త ప్రసరణకు మెదడు, గుండెకు రక్తప్రసరణ చక్కగా అందేందుకు ఆటలు ఉపయోగపడుతాయని సర్కారు భావిస్తున్నది.
కాగా.. రానున్న రోజుల్లో విద్యార్థు లు రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే క్రీడాపోటీల్లో పాల్గొని, ఉత్తమ ప్రతిభ కనబర్చనున్నారు. నిధు ల్లో ఎస్సీ కాంపొనెంట్ కింద 24 శాతం, ఎస్టీ కాం పొనెంట్ కింద 14 శాతం, జనరల్ కాంపోనెంట్ కింద 62 శాతం గ్రాంట్లు ఉపయోగించుకోనున్నారు. ఈ నిధులతో వాలీబాల్, ఫుట్బాల్, టె న్నిస్ బాల్, క్రికెట్ బ్యాట్లు, బాస్కెట్ బాల్, షా ట్పుట్, స్కిప్పింగ్ రోప్స్, త్రో బాల్ వంటి సామగ్రిని కొనుగోలు చేయనున్నారు. అలాగే ప్రథమ చికిత్స కిట్లు, పిల్లలకు అవసరమైన ఆట వస్తువులు కూడా సమకూర్చుకోనున్నారు. అంతేకాకుండా వ్యాయామ ఉపాధ్యాయులు రోజూ విద్యార్థులకు అందజేసి ఆటలు ఆడించి.. వారి శారీరక, మానసిక అభివృద్ధికి దోహదపడనున్నారు.