రామకృష్ణాపూర్, మార్చి 15: రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ 3వ వార్డు పరిధిలోని ఇందిరానగర్ పోచమ్మ ఆలయంలో బుధవారం వార్డు ప్రజలు పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కొక్కుల స్రవంతి, కొక్కుల సతీశ్, వార్డు పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
కాసిపేట మండలంలో..
కాసిపేట, మార్చి 15 : సోమగూడెం గ్రామంలో పోచమ్మ, సల్లమల్లన్న ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 17న విగ్రహ ప్రతిష్ఠాపన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొరికొప్పుల ప్రమీలాగౌడ్, ఎంపీటీసీ చంచు మల్లమ్మ, ఊరగొండ జ్యోతి, లక్ష్మి, చంద్రగౌడ్, రంగు రవి తేజ, దూడం మహేశ్, కే రాంచందర్, మాడ గోపాల్, వొడ్నాల సత్యనారాయణ, చంద్రగిరి సంపత్, సిద్ధయ్య, శ్రీరాముల చిలకయ్య, గంగారాం, భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.