ఖానాపూర్, సెప్టెంబర్ 29 : ఖానాపూర్లో వినాయకుని నిమజ్జనం శుక్రవారం ఘనంగా జరిగింది. గురువారం రాత్రి గణేశ్ మండపాల నుంచి వినాయకుని శోభాయాత్ర ప్రారంభమైం ది. శుక్రవారం ఉదయం వరకు గోదావరిలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, హిందూ ఉత్సవ సమితీ అధ్య క్షుడు మంత్ర రాజం సురేశ్, పలువురు ప్రము ఖులు పర్యవేక్షించారు. సాయినగర్, శివాజీనగర్, విద్యానగర్, సుభాష్నగర్ నుంచి శోభాయాత్ర గోదావరి వరకు కొనసాగింది. ఖానాపూర్ సీఐ మోహన్ ఆధ్వర్యంలో భారీ పోలీసులు బందో బస్తు ఏర్పాటు చేశారు. ఎస్ఐ లింబాద్రి, తహసీ ల్దార్ పరిమల్ భౌమిక్, ఏఈ తిరుపతి, నాయ కులు, అధికారులు పాల్గొన్నారు.
దస్తురాబాద్లో..
దస్తురాబాద్, సెప్టెంబర్ 29 : మండలంలో 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణనా థులు శుక్రవారం గంగమ్మ ఒడికి చేరుకున్నాయి. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో గణేశ్ ఉత్సవ కమిటీ, యుత్ కమిటీల ఆధ్వర్యంలో కొలువుదీరిన వినాయక విగ్రహాలను భక్తుల పుర వీధుల్లో ఊరేగించి, డీజే, బ్యాండ్ మేళాలతో నిమ జ్జనాలకు తరలించారు. మహిళలు, యువకు లు, చిన్నారులు నృత్యాలు చేశారు. గ్రామ శివారులో ఉన్న చెరువుల్లో బై బై గణేశా అంటూ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు.
నిమజ్జనం
కుంటాల, సెప్టెంబర్ 29 : మండలంలో ఓలా, ఆయా గ్రామాల్లో వినాయక నిమజ్జనం ఘనంగా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వ హించా రు. మండల కేంద్రంలోని ఓ వీధికి చెందిన రైతు లంతా కలిసి మణికంఠ యువజన సంఘంగా ఏర్పడి వారు ఏర్పాటు చేసిన వినాయకుడు ఆకట్టుకుంటున్నాడు. రైతు, కుటుంబాన్ని ఆశీర్వ దించే వినాయకుడి చిత్రంతో పాటు పంట పొలం థీమ్తో మండపాన్ని ఏర్పాటు చేశారు.