బోథ్ : బోథ్ నియోజకవర్గం పరిధిలో వాగులపై వంతెనలతో పాటు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సోమవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కోరారు. ఈ మేరకు హైదరాబాద్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. బజార్హత్నూర్ మండలం కొల్హారి వాగుపై వంతెన, నేరడిగొండ మండలం కుంటాల జలపాతం రోడ్డులో సావర్గాం వాగుపై వంతెనతో పాటు తలమడుగు మండలంలోని మహరాష్ట్ర సరిహద్దులో ఉన్న తలాయిగూడ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడానికి అవసరమైన సుమారు రూ 23 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు.
స్పందించిన మంత్రి మంజూరు కోసం సీఎం కార్యాలయానికి ప్రతిపాదనలు పంపుతామని హామీ ఇచ్చారు. అనంతరం నిధుల మంజూరుకు ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే బాపురావు తెలిపారు.