మంచిర్యాల అర్బన్, ఆగస్టు 2 : మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర సర్కారు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నది. ఈ యేడాది కూడా పంపిణీ చేయడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. మంచిర్యాల జిల్లాలో 114 సొసైటీల్లో 6,499 మంది సభ్యులుండగా.. వీరితోపాటు కులవృత్తిని నమ్ముకున్న వారందరి బతుకులకు భరోసా కల్పిస్తున్నది. రూపాయి పెట్టుబడి లేకుండా నీటి పారుదల, గ్రామ పంచాయతీ చెరువుల్లో కోట్లలో చేప పిల్లలను వదిలి ఉపాధి పొందుతున్నారు. ఈ యేడాది కూడా జిల్లాలో 371 ట్యాంకుల్లో 2.20 కోట్ల చేప పిల్లలను వదిలేందుకు లక్ష్యంగా మత్స్యశాఖ నిర్ణయించుకుంది.
ఇందులో 363 (గ్రామ పంచాయతీ ట్యాంకులు 250, 113 డిపార్టుమెంటు ట్యాంకులు) ట్యాంకుల్లో 35 నుంచి 40 మిల్లీ మీటర్ల పొడవు గల 1.21 లక్షల చేప పిల్లలను, ఎనిమిది రిజర్వాయర్లు, ప్రాజెక్టులలో 80 నుంచి 100 మిల్లీ మీటర్ల పొడవు గల 99.58 లక్షల (ఎల్లంపల్లిలో 24.42 లక్షలు, సుందిల్ల బ్యారేజ్లో 22.80 లక్షలు, అన్నారం బ్యారేజ్లో 25.12 లక్షలు, గొల్లవాగులో 9.90 లక్షలు, నీల్వాయి వాగులో 9.96 లక్షలు, రాళ్లవాగులో 4.44 లక్షలు, పెద్దపేట పెద్ద చెరువులో 1.26 లక్షలు, నల్లవాగులో 1.68 లక్షలు) చేప పిల్లలను వదలనున్నారు. గతేడాది 321 ట్యాంకుల్లో 2 కోట్ల చేప పిల్లలను వేయగా.. ఈ యేడాది 371 ట్యాంకుల్లో 2.20 కోట్ల చేప పిల్లలను వదలడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
మూడో వారంలో పంపిణీ చేస్తాం..
తెలంగాణ ప్రభుత్వం ఉచి తంగా చేప పిల్లలను పంపిణీ చేస్తూ మత్స్య కారుల జీవితాల్లో వెలుగులు నింపు తోంది. ఇందుకు తగిన ట్టుగానే ఈ యేడాది వర్షాలు సంవృద్ధిగా కురి శాయి. దాదాపు అన్ని ట్యాంకులలో వంద శాతం నీరు వచ్చి చేరింది. వరదలు తగ్గిన తరువాత, అంటే ఈ నెల రెండు లేదా మూడో వారంలో చేప పిల్లల పంపిణీని ప్రారంభిస్తాం.
– సత్యనారాయణ, జిల్లా మత్స్యశాఖ అధికారి, మంచిర్యాల.