సారంగాపూర్, ఆగస్టు 10 : ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలోని ఫానూర్ గ్రామంలోని వేలాల మల్లన్న ఆలయ అభివృద్ధికి సారంగాపూర్ మండల తాజామాజీ ఎంపీపీ కోల జమున-శ్రీనివాస్ లు ఆదివారం రూ. 50వేల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. జైపూర్ లోని వేలాల మల్లన్న ఆలయాన్ని మాజీ ఎంపీపీ కోల జమున శ్రీనివాస్ దంపతులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా మల్లన్న పట్నాల గద్దె నిర్మాణం, రేకుల షెడ్డు నిర్మాణం కోసం విరాళంగా రూ. 50వేలు ఆలయ ఈఓకు అందజేసినట్లు తెలిపారు. వీటి నిర్మాణాలకు రూ. 50లకు పైగా ఖర్చు అయిన వాటిని తామే ఇస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రేకుల షెడ్ నిర్మాణానికి భూమిపుజలు చేసి పనులు ప్రారంభించారు. జమున, శ్రీనివాస్ దంపతులను ఆలయ అధికారులు, గ్రామస్తులు పలువురు అభినందించారు.