భైంసా, అక్టోబర్ 20 : బీఆర్ఎస్ ముథోల్ అభ్య ర్థి విఠల్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పని చేయాలని మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ సూచించారు. ఎమ్మెల్యేతో కలిసి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మండల కార్యకర్తలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ నాటి ప్రభుత్వాల హ యాంలో వందల్లో పింఛన్ వస్తే నేడు వేలల్లో వస్తుందన్నారు. అలాగే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో నిరుపేద ఆడబిడ్డల తల్లిదండ్రులకు అండగా ఉంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ఇంటింటికీ వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించాలని సూచించారు.
ఈ ఎన్నికల్లో తనను మళ్లీ గెలిపిస్తే సేవకుడిగా పని చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మె ల్యే విఠల్ రెడ్డి అన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు, ప్రజల బాధలు ఎలా ఉండేవో నేటి తరానికి వివరించాలన్నారు. అలా గే తెలంగాణ వచ్చాక అభివృద్ధి, రాకముందు పరిస్థితులను ప్రతి ఒక్కరికీ వివరించాలని సూచించారు. సీఎం కేసీఆర్ సహకారంతోనే పుష్కలంగా నిధులు తెచ్చి ముథోల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానన్నారు. అనంతరం భైంసా మండలానికి చెందిన 15 మంది వరకు బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సూర్యంరెడ్డి, గౌర శ్రీనివాస్, సదాశివ్, దేవేందర్ రెడ్డి, రాజేశ్, గణేశ్, రాంకుమార్, రమణ రెడ్డి, గంగాధర్, నర్సారెడ్డి, భైంసా మండల నాయకులు ఉన్నారు.
భైంసా, అక్టోబర్ 20 : బీఆర్ఎస్తోనే సంక్షే మం, అభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్సీ పు రాణం సతీశ్ అన్నారు. పట్టణంలోని పార్టీ కా ర్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించి మా ట్లాడారు. అందరూ కలిసి సైనికుల్లా శ్రమించి బీఆర్ఎస్ సత్తా చూపించాలని కోరారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ కృష్ణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మురళీగౌడ్, రమేశ్ మాశెట్టివార్, రాజేశ్వర్, దత్తు, వెంకటేశ్, వాసే, జావిద్, భోజరాం, తోట రాము, ఆయా మండలాల నాయకులు తదితరులు ఉన్నారు.
భైంసాటౌన్, అక్టోబర్, 20 : పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కార్యకర్తలతో బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై చర్చించి అభిప్రాయాలను తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని ఇంటిం టా తిరుగుతూ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించాలని సూచించారు.
భైంసా, అక్టోబర్ 20 : తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు మద్దతుగా పార్టీలో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ అన్నారు. ము థోల్ నియోజకవర్గంలోని నర్సాపూర్ (జీ) మం డలం బూర్గుపల్లికి చెందిన పలువురు ఎమ్మె ల్సీ పురాణ సతీశ్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సుమారు 50 మంది వరకు సేవాలాల్ యూత్ సభ్యులు ఈశ్వర్, విక్రమ్, గులాబ్, రాజు, సందీప్, కిరణ్తో పాటు సుమారు 50 మంది పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.