ఆదిలాబాద్, జూన్ 28(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర మం త్రులు జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ల పర్యటన వల్ల మైనార్టీలకు ప్రయోజనం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమం త్రి కేసీఆర్ మైనార్టీల సంక్షేమానికి ప్రాధా న్యం ఇచ్చి రాష్ట్రంలో 200 మైనార్టీ గురుకులాలలను ఏర్పాటు చేశారన్నారు. ఆదిలాబాద్లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినా బాలురు, బాలికల మైనార్టీ గురుకులాలను కాంగ్రెస్ మంత్రులు ప్రారంభించడం తప్ప కొత్తగా చేసిన అభివృద్ధి ఏముందని ప్రశ్నించారు. గురుకులాలను ప్రారంభించిన మంత్రులు విద్యార్థులతో కనీసం మాట్లాడలేదని, విద్యావిధానంపై సమీక్ష నిర్వహించకపోవడం వారి అసమర్థపాలనకు నిదర్శనమన్నారు. మైనార్టీల అభివృద్ధి కోసం రూ.18 కోట్లు మంజూరు చేసి మసీదులు, గ్రీవ్యార్డులు ఇతర కా ర్యక్రమాలను చేపట్టామన్నారు. మైనార్టీ స్టడీ సర్కిల్ కోసం రూ.4 కోట్లు రావాల్సి ఉందని, జిల్లాలో రూ.14 కోట్లతో మైనార్టీల కోసం సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో జిల్లాకు వచ్చే మంత్రులు అభివృద్ధి నిధు లు ప్రాజెక్టులు తీసుకురావాలన్నారు. మైనార్టీ నాయకులు యూనిస్ అక్బానీ, సాజిదొద్దీన్, సలీం పాషా, ఎజాజ్, ఆసిఫ్, జమిల్, సూర్యాకాంత్ ఉన్నారు.