ఎదులాపురం, ఏప్రిల్ 10 : జిల్లాలోని బీజేపీకి చెందిన ఎంపీ నగేశ్, ఆదిలాబాద్ ఎమ్మె ల్యే పాయల్ శంకర్ మోసపూరిత మాస్టర్ ప్లాన్ను విడుదల చేశారని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎంపీ, ఎమ్మెల్యేపై 420 కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ డీపీవో కార్యాలయంలో ఏఎస్పీ మౌనికను కలిసి ఫిర్యాదును అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ మరో పక కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఎలాంటి మాస్టర్ ప్లాన్ రూపొందించలేదని పత్రికాముఖంగా తెలిపినప్పటికీ, ముందస్తుగా ఎంపీ, ఎమ్మెల్యే మోసపూరిత ప్రకటనలతో ఆదిలాబాద్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
ఎలాంటి నిజా నిర్ధారణ లేకుండా పత్రికా ముఖంగా ఎమ్మెల్యే పాయ ల్ శంకర్, ఎంపీ నగేశ్ డూప్లికేట్ మాస్టర్ ప్లాన్ను రూపొందించి ఫిబ్రవరి 24న విడుదల చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ నెల 17న బృందాలతో సర్వే నిర్వహించనున్నట్లు తెలుపడంతో వీరు చేసిన మోసం బయట పడుతుందన్నారు.
ఎమ్మెల్యే మోసపూరిత ప్రకటనలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడని, ఆయనపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జోగు రామన్న వెంట పట్టణ అధ్యక్షుడు అజ య్, వెనగంటి ప్రకాశ్, ఆత్రం వెంకటేశ్, అన్నె లా వసంత్, అశోక్ స్వామి పందిరి భూమన్న, అనిల్ ధమ్మపాల్, కొండ గణేశ్, బట్టు సతీశ్, సృజన్, దివిటీ రాజు, మహేశ్ పాల్గొన్నారు.