నిర్మల్ అర్బన్, డిసెంబర్ 9 : ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సర్వసాధారణమని, ప్రజల తీర్పును శిరసా వహిస్తామని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో పోటీ చేసిందని, పార్టీ తరఫున 39 మంది గెలుపొందారని పేర్కొనానరు. కష్టపడ్డ చైర్మన్లు, కన్వీనర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రజలను ఓట్లు అడిగామని, ఎక్కడా ప్రతిదాడులకు పాల్పడలేదని పేర్కొన్నారు.
ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రజల పక్షాన నిలబడుతామన్నారు. కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. నిర్మల్లో ప్రజ లు ఎన్నో రకాల తీర్పులను ఇచ్చారని, ఎన్నో పర్యాయాలు ఎన్నికలను చూశామని పేర్కొనానరు. సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్ర చారాలు చేసి ఓట్లను పొందారని, తాము అభివృద్ధిని చూపిస్తూ ప్రజలను ఓట్లు అడిగామని వెల్లడించారు. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు పా ర్టీ మారుతారని వచ్చే పుకార్లను కొట్టిపారేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమలుపర్చారని, మిగతా వాటన్నింటినీ అమలుపర్చాలన్నారు. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ను ఎన్నుకున్నట్లు, ఆయన పిలుపు మేరకు కార్యాచరణ ఉండనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వ ర్, పార్టీ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, జిల్లా అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, నాయకులు జీవన్ రెడ్డి, సుభాష్ రావు, గోవర్ధన్ రెడ్డి, మండల కన్వీనర్లు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.