శ్రీరాంపూర్, జనవరి 26 : తెలంగాణ ప్రైవేట్ పాఠశాలల సంఘం (ట్రస్మా) మాజీ ప్రధాన కార్యదర్శి, మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షుడు ఎస్ రాజారెడ్డి శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందినట్లు జిల్లా అధ్యక్షుడు బత్తిని దేవన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ రేగళ్ల ఉపేందర్, రాష్ట్ర కార్యదర్శి మల్లెత్తుల రాజేంద్రపాని తెలిపారు.
రాజారెడ్డి మృతికి సంతాపకంగా ఈ నెల 27న మంచిర్యాల జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. రాజారెడ్డి 30 ఏళ్లపాటు విద్యారంగంలో సేవలందించారని, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు అనేక హక్కులు సాధించి పెట్టారని పేర్కొన్నారు. రాజారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.