వాంకిడి, ఫిబ్రవరి 14 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని 29 వేల హెక్టార్లలో గోయగాం అటవీ ప్రాంతం విస్తరించి ఉందని, ఈ రేంజ్లో ఉండాల్సిన సి బ్బంది పూర్తిస్థాయిలో లేరని, దీని కారణంగానే అడవుల నరికివేతను అడ్డుకోలేక పోతున్నామని ఆసిఫాబాద్ అటవీ రేంజ్ అధికారి అప్పల కొండ తెలిపారు. ‘అటవీ శాఖలో అవినీతి కొండ’ అనే శీర్షికన బుధవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి ఆయ న స్పందించారు. తన సిబ్బందితో కలిసి చెట్లు నరికిన ప్రాంతాన్ని సందర్శించారు.
టేకు చెట్ల ను తనిఖీ చేసి వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెట్లు న రికి వేయడిన మాట వాస్తమేనని అన్నారు. స్మ గ్లర్లు అటవీ సిబ్బంది ఎక్కడ ఉన్నారని నిఘా పెట్టి అడవులను నరుకుతున్నారన్నారు. గత నవంబర్లో వంద చెట్ల వరకు నరికారని, తా జాగా కొన్ని చెట్లను నరికి ఉంటారని అన్నా రు. టేకు చెట్లను నరికి కలప రవాణా చేస్తున్న షేక్ ఖాజా, షేక్ సమీర్, షేక్ హబీబ్, షేక్ జమీర్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.