పులి గాండ్రింపులు అటవీ గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బెజ్జూర్, దహెగాం, చింతలమానేపల్లి, సిర్పూర్(టీ), కాగజ్నగర్లో సంచరిస్తూ మూగజీవాలపై పంజా విసురుతుండగా, పట్టపగలు కూడా చేలకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. టైగర్ ఆచూకీ కోసం అన్వేషిస్తున్న అటవీశాఖ అధికారులు పల్లెల్లో డప్పు చాటింపులు, మైక్ల ద్వారా ప్రచారం చేస్తూ అప్రమత్తం చేస్తున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో పులి సంచారం అటవీ అధికారులతో పాటు గిరి గ్రామాల ప్ర జలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. వాంకిడి మండలంలో రైతు భీమును చంపిన పులి పెద్దవాగు దాటి కాగజ్నగర్- సిర్పూర్- చింతలమానేపల్లి మండలాల్లోని మారుమూ ల అటవీ గ్రామాల మీదుగా బెజ్జూర్ వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో డప్పు చాటింపులు, మైక్ల ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆదివారం బెజ్జూర్ మండలంలోని రెబ్బెన, కౌ టగూడ గ్రామాల్లో సరిహద్దుల్లోని పత్తి చేళ్లలో పులి సంచిరించినట్లు సమాచారం తెలుసుకు న్న అధికారులు పులి పగ్మార్క్( అడుగు గుర్తు)ల కోసం ప్రయత్నిస్తున్నారు. కాగజ్నగర్ డివిజనల్ అటవీ అధికారి విజయ్కుమార్ సిబ్బందితో పులిని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సిర్పూర్ (టీ) మండలంలోని రైల్వే ట్రాక్ సమీపంలోని అటవీ ప్రాంతంలో అటవీ కుక్కల (రేస్ కుక్కల) దాడిలో దుప్పి మృతి చెందినట్లు భావిస్తున్నారు.
సరిహద్దు గ్రామాల్లో భయంభయం..
జిల్లాలో ఎక్కువగా పత్తి చేన్లు అటవీ ప్రాం తాల్లో ఉండడం.. దిగుబడి చేతికి వచ్చే సమ యం కావడంతో రైతులు, కూలీలు పంటల కాడికి వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. ఆదివారం చింతలమానేపల్లి మండలంలోని డబ్బా, ఆడెపల్లి, బాబాసాగర్ గ్రామాల ప్రజలు చేనుల్లోకి వెళ్లవద్దని డప్పు చాటింపు చేయడంతో పాటు మైక్ల ద్వారా అవగాహన కల్పించారు. జిల్లా లో రోజురోజుకు పులి సంచారం ఎక్కువవుతుండడంతో పట్టపగలు కూడా చేన్లకు వెళ్లలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. బెజ్జూర్, పెం చికల్పేట్, చింతలమానేపల్లి మండలాల్లోని ప్రాణహిత అటవీ ప్రాంతాల్లో పులుల సంచా రం నాలుగు రోజులుగా ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రాణహితను దాటి..
జిల్లా సరిహద్దున ఉన్న మహారాష్ట్ర అటవీ ప్రాంతాల నుంచి ప్రాణహితను దాటి జిల్లా అడవుల్లోకి ప్రవేశిస్తున్న పులులు కాగజ్నగర్ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. ఆసిఫాబాద్ డివిజన్లోకి వెళ్లిన పులి కాగజ్నగర్ పెద్దవాగు వైపు నుంచి కాగజ్నగర్ అటవీ ప్రాం తంలోకి ప్రవేశించినట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు. గురువారం రాత్రి కాగజ్నగర్ పెద్దవాగు ప్రాంతంలో పులి సంచరించిందనే సమాచారం అధికారుల అంచనాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. దీనిని ధ్రువీకరించుకునేందుకు అధికారులు ప్రత్యేక బృందాలతో పులి పగ్మార్క్ కోసం ప్రయత్నిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలని చాటింపు
చింతలమానేపల్లి, నవంబర్ 20 : మండలకేంద్రంతో పాటు బాబాసాగర్, ఆడెపల్లి, డబ్బా గ్రామాల్లో పులి సంచారం ఉందని అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్లు, అటవీశాఖ అధికారులు డప్పు చాటింపు చేయించారు. బాబాసాగర్, అర్కగూడ సమీపంలో పులి అ డుగులను గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పత్తి చేల్లోకి వెళ్లొద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
బెజ్జూర్ మండలంలో..
బెజ్జూర్, నవంబర్ 20 : మండలంలోని కొత్తగూడ, రెబ్బెన శివారు పత్తి చేలల్లో ఆదివా రం తెల్లవారుజామున పులి కనిపించిందని ఉదయం చేలకు వెళ్లిన కొత్తగూడ రైతులు, గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో కాగజ్నగర్ ఎఫ్డీవో విజయ్ కుమార్ సిబ్బందిని వెంట పెట్టుకొని కొత్తగూడకు చేరుకున్నారు. రెబ్బెన శివారు చేనులో అక్కడక్కడ పులి పాదముద్రలను ప రిశీలించారు. కడంబ అటవీ ప్రాంతం నుంచి బెజ్జూర్, కర్జెల్లి అటవీ ప్రాంతాల వైపు వెళ్లి ఉం డొచ్చని తెలిపారు. పులి పాద ముద్రల ఆధారంగా ఎక్కడికి వెళ్లిందో తెలియజేస్తామని ఎఫ్డీవో తెలిపారు. ఆయన వెంట సిర్పూర్ రేంజ్ సెక్షన్ అధికారి సద్దాం, బెజ్జూర్ రేంజ్ బీట్ అధికారులు సత్యం, ముత్యం, శ్రీనివాస్, యానిమల్ ట్రాకర్స్, సిబ్బంది ఉన్నారు.