నిర్మల్, జూలై 27(నమస్తే తెలంగాణ) : పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు బుధవారం అర్ధరాత్రి నుంచి భారీ వానలు పడు తుండడంతో నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణ ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులతోపా టు పాదచారులు ఇబ్బందులు పడ్డారు. నిర్మల్ పట్టణంలోని ఇందిరానగర్, శాస్త్రీనగర్, జీఎన్ఆర్ కాలనీ, డాక్టర్స్ లేన్లో వర్షపు నీరు చే రింది. కడెం, గడ్డెన్న, స్వర్ణ ప్రాజెక్టుల్లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద వచ్చి చేరడం తో గేట్లు ఎత్తి దిగువనకు నీటిని వదులుతున్నారు.
జలాశయాలకు పోటెత్తిన వరద
భైంసాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టులోకి గురు వారం ఉదయం నుంచి భారీగా వరద నీరు వ చ్చి చేరుతున్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 అడుగులు కాగా, 358.30 అడుగుల వద్ద నీటిని స్థిరంగా ఉంచుతూ.. ప్రాజెక్టు ఐదు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 89 వేల క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 79 వేలుగా ఉంది. స్వర్ణకు వరద నీరు పోటెత్తుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1,183 అడుగులు కాగా, 1,182.80 అడుగల వద్ద నీటి నిల్వలు ఉంచి, అదనంగా వచ్చిన నీటిని ప్రాజెక్టు ఆరు గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 40 వేల క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 45 వేలుగా ఉంది.
కడెంకు తప్పిన ముప్పు
కడెం ప్రాజెక్టులోకి గురువారం ఉదయం అ నూహ్యంగా దాదాపు 3.80 లక్షల క్యూసెక్కు ల వరద వచ్చి చేరింది. దీంతో అధికారులు నీ టిని దిగువకు విడుదల చేశారు. గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతి సమాచారాన్ని తెలుసుకున్న మంత్రి అల్లోల , ఖానాపూర్ ఎ మ్మెల్యే రేఖానాయక్, కలెక్టర్ వరుణ్రెడ్డి ప్రాజె క్టు వద్దకు చేరుకున్నారు. వెంటనే అధికారుల ను అప్రమత్తం చేసి పరిస్థితిని సమీక్షించారు. ప్రాజెక్టు వద్ద చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. సాయంత్రం కొంత ఇన్ఫ్లో తగ్గడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా 700.22 అడుగుల వరకు ప్రమాదకర స్థా యిలో నీటిమట్టం ఉంది. ప్రాజెక్టు 15 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువనకు వ దులుతున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 1,87, 760 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 2,58,905 క్యూసెక్కులు ఉంది. మొరాయించిన మిగతా 4 గేట్లను కూడా జేసీబీ సాయంతో ఎత్తేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యం లో ప్రాజెక్టు పరీవాహక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కడెం గ్రామా న్ని ఇప్పటికే ఖాళీ చేయించిన అధికారులు.. అంబారిపేట, చిట్యాల, కొండుకూరు, కన్నాపూర్, బెల్లాల్ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. అలాగే ప్రాజెక్టు దిగువన గల దస్తురాబాద్ మండలంలోని దేవునిగూడెం, రాంపూ ర్, మున్యాల్, బూత్కూర్, గోండుగూడెం, గిడిసిర్యాల గ్రామాల ప్రజలు కూడా వరద వస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.