సీఎం కేసీఆర్ మంచిర్యాల వేదికగా మరో రెండు అద్భుత పథకాలకు అంకురార్పణ చేశారు. బీసీ కులవృత్తులకు రూ.లక్ష ఆర్థికసాయం, రెండో విడుత గొర్రెల పంపిణీకి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు.
నాయీ బ్రాహ్మణులకు మోడ్రన్ సెలూన్కు రూ.లక్ష.. ధోబీఘాట్, మోడ్రన్ లాండ్రీ షాపులకు రూ.లక్ష, ఇతర చిరు వ్యాపారులు, బీసీ కులాల్లో చేతివృత్తులను ఆదుకునేందుకు పథకాన్ని ప్రారంభించినట్లు కేసీఆర్ తెలిపి.. లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఇండ్లు లేని నిరుపేదలకు స్థలాల పట్టాలు అందించారు.