ఎదులాపురం, జనవరి 25 : కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్వో సాధన సూచించారు. పట్టణంలోని సంజయ్నగర్లో ఖుర్షీద్నగర్ యూపీహెచ్సీ ఆధ్వర్యంలో మంగళవారం వైద్యసిబ్బంది నిర్వహించిన జ్వర సర్వేను పరిశీలించారు. సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆమె ఇంటింటికీ తిరుగుతూ కరోనా లక్షణాలున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నా రు. వ్యాక్సిన్ తీసుకోని వారి వివరాలను సేకరించారు. అర్హు లై ఉండి వ్యాక్సిన్ తీసుకోని వారికి అప్పటికప్పుడు టీకా వేయించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్వో మా ట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతో పాటు వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. లక్షణాలున్న వారు సమీప పీహెచ్సీకి వెళ్లి పరీక్ష చేయించుకోవాలన్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న కొవిడ్ కిట్లను వాడాలని పేర్కొన్నారు. ఆమె వెంట ఖుర్షీద్నగర్ మెడికల్ ఆఫీసర్ శిల్ప, సీవో ప్రశాంత్దేశ్పాండే, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఉన్నారు.
గంగాపూర్లో..
నార్నూర్, జనవరి 25 : మండలంలోని గంగాపూర్ గ్రామంలో నార్నూర్ సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది జ్వర సర్వే నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి కరోనా లక్షణాలున్న వారికి మందుల కిట్లు పంపిణీ చేశారు. అర్హలకు టీకా వేశారు. కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు చౌహాన్ చరణ్దాస్, రాజమ్మ, వైద్య సిబ్బంది సింధు, ఆశ కార్యకర్త విజయలక్ష్మి పాల్గొన్నారు.
కరోనా వైరస్ నియంత్రణకు చర్యలు
నార్నూర్, జనవరి 25 : కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఖండో ఎంపీటీసీ రాథోడ్ కిరణ్ అన్నారు. గ్రామంలో గాదిగూడ పీహెచ్సీ వైద్య సిబ్బంది జ్వర సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం ఊర్మిళ, రవీందర్, ఉప సర్పంచ్ స్వాతి రవీందర్, ఈశ్వర్, బాలాజీ, మల్లేశ్ పాల్గొన్నారు.
నేరడిగొండ, జనవరి 25 : మండలంలోని బంధంరేగడి, వెంకటాపూర్ గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే చేశారు. అనారోగ్యంతో ఉన్న వారిని గుర్తించి మందుల కిట్ అందజేశారు. తర్నం గ్రామంలో వ్యాక్సినేషన్ శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ఈవో హరికుమార్గౌడ్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.