ఇచ్చోడ, డిసెంబర్ 30 : మండలంలో రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నది. అడెగామ (కే), అడెగామ (ఎస్సీ కాలనీ), కోకస్మన్నూర్, రంజాన్ఫుర, ఇస్లాంపుర కాలనీలో గురువారం ఇంటింటా తిరుగుతూ 559 మందికి రెండో డోస్ వేశారు. నేటి వరకు మొదటి డోస్ టీకా వేసుకోలేకపోయిన 59 మందికి టీకాలు వేశారు. మండలంలో మొదటి దశ టీకాలు వందశాతం పూర్తి చేశామని వైద్యులు పేర్కొన్నారు. వైద్యాధికారి ఆకుదారి సాగర్, హెల్త్ అసిస్టెంట్లు సుభాష్, ఉత్తంసింగ్, రాథోడ్ కైలాస్, మునమ్మ, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
రెండో డోసులూ తప్పనిసరి
బోథ్, డిసెంబర్ 30 : ప్రతి ఒక్కరూ రెండో డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని సొనాల పీహెచ్సీ వైద్యుడు కే నవీన్రెడ్డి సూచించారు. మండలంలోని పట్నాపూర్లో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. మొదటి డోసు తీసుకొని 84 రోజులు పూర్తయిన వారందరూ రెండో డోసు తీసుకోవడానికి అర్హులన్నారు. ఒమిక్రాన్ వేరియంట్తో కేసులు పెరుగుతున్నందున అందరూ టీకాతో పాటు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు. సర్పంచ్ పీ సుగుణ, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా.. నారాయణ్పూర్, ధన్నూర్ (బీ), పొచ్చెర, కౌఠ (బీ), తదితర గ్రామాల్లో వైద్య సిబ్బంది టీకాలు వేశారు.
డోప్టాలలో ..
బేల మండలంలోని డోప్టాల గ్రామంలో గురువారం కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ క్యాంపు నిర్వహించా రు. వ్యాక్సిన్తో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని డోప్టాల స ర్పంచ్ బోడకుంటివార్ రాకేశ్ పేర్కొన్నారు. ఏఎన్ఎం లలిత, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, కార్యదర్శి పాల్గొన్నారు.
అర్హులు వ్యాక్సిన్ వేసుకోవాలి
అర్హులంతా కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని జడ్పీటీసీ తాటిపెల్లి రాజు పేర్కొన్నారు. మండలంలోని హస్నాపూర్, తాంసి, పొన్నారిలో గురువారం వ్యాక్సిన్ సెంటర్లను పరిశీలించారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ఈయన వెంట హెల్త్ అసిస్టెంట్ నగేశ్, ఏఎన్ఎం లక్ష్మి, నాయకులు రఘు, చంద్రన్న, దయానంద్, ఆశ కార్యకర్తలు జ్యోతి, వెంకటమ్మ పాల్గొన్నారు.
కొనసాగుతున్న శిబిరాలు
మండలంలోని సావర్గాం, సేవాదాస్నగర్, పీచర, నేరడిగొండ, రోల్మామడ, తర్నం(కే), రాజులతండా, కుమారి, వడూర్, నారాయణపూర్, ఆరెపల్లి గ్రామాల్లో గురువారం వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటు చేశారు. రెండో డోసు వేసుకోని వారికి వ్యాక్సిన్ వేసినట్లు హెచ్ఈవో హరికుమార్గౌడ్ తెలిపారు.
టీకానే శ్రీరామ రక్ష
కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ శ్రీరామ రక్ష అని గాదిగూడ ఎంపీవో సాయిప్రసాద్ పేర్కొన్నారు. గాదిగూడ మండలం దాబీ(బీ) గ్రామంలో నిర్వహించిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పర్యవేక్షించారు. మొదటి టీకా తీసుకున్న వారందరికీ రెండో డోస్ వేసేలా చూడాలని వైద్య సిబ్బ ందికి సూచించారు. పంచాయతీ కార్యదర్శి వెంకట్సాయి, వైద్య సిబ్బంది ఉన్నారు.