తాండూర్ : రైతులు సాంప్రదాయ పంటల బదులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని, పంటల మార్పిడి (Crop Diversification ) వైపు దృష్టిని సారించాలని కేవీకే శాస్త్రవేత్త సాధ్వి ( Scientist Sadhvi ) కోరారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని శుక్రవారం మండలంలోని ద్వారకాపూర్ గ్రామంలో సర్పంచ్ మాసాడి తిరుపతి అధ్యక్షతన నిర్వహించారు.
ఆమె మాట్లాడుతూ రైతులకు సమతుల్య ఎరువుల వినియోగం, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణమైన పంటల ఎంపిక, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు.ప్రకృతి వ్యవసాయం, విలువ ఆధారిత పంటలు, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించే పద్ధతులను వివరించారు.
రైతులు అడిగిన వివిధ వ్యవసాయ సంబంధిత ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సమాధానాలు ఇస్తూ, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలపై మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మిట్ట దుర్గ, మండల వ్యవసాయ అధికారి కే సుష్మ, ఉద్యానవన అధికారి అర్చన, ఏఈవో యూ శంకర్ పంచాయతీ కార్యదర్శి కార్తీక్ రాజు, రైతులు పాల్గొన్నారు.