దిలావర్పూర్, ఫిబ్రవరి 15 : ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు అద్భుత కార్యక్రమ మని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుం బ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి పేర్కొ న్నారు. దిలావర్పూర్ రెడ్డి సంఘ భవనంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని బుధవా రం జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డితో కలిసి పరిశీ లించా రు. సంబంధిత కంటి పరీక్షల కోసం వచ్చిన వ్యక్తిని సమస్యపై అడిగి తెలుసుకున్నారు. జిల్లా వైద్యాధికారి ధన్రాజ్, జిల్లా ఉప వైద్యాధి కారి డాక్టర్ రాజేందర్, జిల్లా కంటి వెలుగు ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్, ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్ కరీం, ఎంపీడీవో మోహన్రెడ్డి, పీహెచ్సీ వైద్యు డు శ్యామ్ కుమార్, ఎంపీవో అజీజ్ఖాన్, సర్పం చ్ వీరేశ్ కుమార్, పంచాయతీ ఈవో చంద్రశేఖర్, ఐకేపీ ఏపీఎం సులోచనారెడ్డి, ఈజీఎస్ ఏపీవో దివ్యారెడ్డి ఉన్నారు.
నిర్మల్ చైన్గేట్, ఫిబ్రవరి 15 : ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చర్య లు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి ఆదేశిం చారు. నిర్మల్లోని బస్తీ దవాఖాన, కంటివెలుగు వైద్య శిబిరాలను, మాతా శిశుసంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ వరుణ్రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. బస్తీ దవాఖానను సందర్శించి రోగులకు అందుతున్న సేవలను ఆరా తీశారు. అనంతరం మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రా న్ని సందర్శించారు. జేడీ (ఎంహెచ్ఎన్) పద్మజ, జేడీ (సీహెచ్ఐ) సుధీర, జిల్లా వైద్యాధికారి ధన్రాజ్, ఆర్డీవో స్రవంతి, సూపరింటెండెంట్ దేవేందర్రెడ్డి, ఎంసీహెచ్ ఇన్చార్జి రజినీ, అధి కారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రక్తహీనతతో బాధపడే గర్భిణులకు సకాలంలో సేవలం దించా లని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత మహంతి అన్నారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో నిర్మల్, ఆదిలా బాద్ జిల్లా వైద్యాధికారులు, ఇతర అధికారులతో జిల్లా కలెక్టర్ వరుణ్రెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. పీహెచ్సీలు, ఉప కేంద్రాల నిర్మాణాన్ని అడిగి తెలుసుకున్నారు.