కొలువుల కోలాహలం మళ్లీ మొదలైంది. యువత కలలను సాకారం చేసేందుకు ఉద్యోగ ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టిన రాష్ట్ర సర్కారు ఇప్పటికే, గ్రూప్-1, పోలీసు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి, ప్రిలిమినరీ పరీక్షలను పూర్తి చేసింది. తాజాగా 9168 పోస్టులతో గ్రూప్-4 నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీంతో నిరుద్యోగుల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే ప్రిపరేషన్లో భాగంగా పుస్తకాలతో కుస్తీ పడుతున్న యువత ఎన్నడూ లేని విధంగా వరుసగా నోటిఫికేషన్లు వెలువడుతుండడంతో ఆనందంలో మునిగితేలుతున్నది. ఇక ఇదే అనువైన సమయమని భావించి కొలువు కొట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నది. కాగా, ఈనెల 23 నుంచి గ్రూప్ 4 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది.
బెల్లంపల్లి, డిసెంబర్ 2 : బెల్లంపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రూ.14 కోట్లతో వంద పడకల దవాఖాన నిర్మాణం చేపడుతుండగా, దాదాపు పనులన్నీ తుది దశకు చేరుకున్నాయి. రోగులకు వైద్యం అందించడానికి కావాల్సిన గదులు, విభాగాల పనులు పూర్తయ్యాయి. వైద్య సిబ్బంది నియామకమైన వెంటనే ప్రారంభోత్సవం చేయడానికి కమ్యూనిటీ హెల్త్ సర్వీస్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
దవాఖానలో వైద్యులు, రోగుల కోసం మొత్తం 14 ఓపీ గదు లు నిర్శించారు. బ్లడ్ బ్యాంకు కోసం మరో ప్రత్యేక గదిని ఏ ర్పా టు చేశారు. కిడ్నీ రోగులకోసం ప్రత్యేకంగా డయాలసిస్ గది ని ర్మాణం పూర్తి చేసి సంబంధిత పరికరాలను కూడా అమర్చారు. మొదటి అంతస్తులో 50 పడకల చొప్పున వేర్వేరుగా రెండు వైపు లా వార్డులను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన వైద్యులు, రోగుల అటెండర్లకు ప్రత్యేక గదులు నిర్మించారు. పేషెంట్ అటెం డర్ వేచి ఉండేందుకు హాల్ పనులు తుది దశకు చేరుకున్నాయి.
దవాఖానకు తగినంత మంది వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, నర్సింగ్, క్లాస్ఫోర్త్ తదితర సిబ్బంది పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. నియామక ప్రక్రియ పూర్తి కాగానే దవాఖానను ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే రోగులకు మెరుగైన వైద్యం అందించవచ్చు.
బెల్లంపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ద్వారా పేదలకు ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. దశాబ్ధాలుగా ఇక్కడ వంద పడకల దవాఖాన ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో అది ఆచరణకు నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావును కలిసి విన్నవించడంతో ఇక్కడ వంద పడకల దవాఖాన మంజూరు చేశారు. వంద పడకల దవాఖానతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. బెల్లంపల్లి, నెన్నెల, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి, తాండూర్, మందమర్రి మండలాలతో పాటు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన, దహెగాం, చుట్టు పక్క మండలాల ప్రజలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్యం చేయించుకుంటారు. పరిస్థితి విషమించినప్పుడు మంచిర్యాల ఏరియా దవాఖానకు వెళ్తుంటారు. ఈ దవాఖాన ప్రారంభమైతే ఇక్కడే అన్ని రకాల వైద్య సేవలు అందనున్నాయి.
బెల్లంపల్లి వంద పడకల దవాఖాన నిర్మాణం తుది దశకు చేరుకున్నది. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, నర్సింగ్, ఇతర పోస్టుల నియామకం పూర్తి చేసి దవాఖాన ప్రారంభిస్తాం. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల కల నెరవేరబోతుంది. బెల్లంపల్లి నియోజకవర్గంతో పాటు చెన్నూర్ నియోజకవర్గం, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా మండలాల వారికి ఇది అనువుగా ఉంటుంది. జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన పని లేకుండా ఇక్కడే వైద్య సేవలు పొందవచ్చు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చేతుల మీదుగా ప్రారంభింపజేస్తాం. – దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్యే, బెల్లంపల్లి
ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే దవాఖానను ప్రారంభిస్తాం. దవాఖాన నిర్మాణం దాదాపు పూర్తయినట్లే. వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టుల నియామకాలు కావాల్సి ఉంది. నూతన భవనంలో రోగులకు కావాల్సిన అన్నివసతులు కల్పించారు. 50 పడకల చొప్పున వేర్వేరుగా వార్డులను ఏర్పాటు చేశారు. స్పెషలిస్ట్ వైద్యుల కోసం 14 ఓపీ గదులు ఏర్పాటు చేశారు. డయాలసిస్ పరికరాలు వచ్చాయి. ఇప్పటి వరకు పాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోనే రోగులకు వైద్య సేవలు అందిస్తున్నాం. ప్రారంభం కాగానే అన్ని రకాల వైద్య సేవలు అందిస్తాం.
– డాక్టర్ అరవింద్, డీసీహెచ్సీ