సంగారెడ్డి : జిల్లాలోని కంగ్టి మండలం తడ్కల్ గ్రామశివారులోని 174 సర్వే నంబర్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుచేస్తున్న గంజాయి మొక్కలను మంగళవారం ఎస్ఐ అబ్దుల్ రఫీక్ తమ సిబ్బందితో కలిసి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. నిషేధిత గాంజాయి మొక్కలను సాగు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు.. తడ్కల్ గ్రామ శివారులో ఓ రైతు చేనులు దాడులు చేపట్టామన్నారు.
ఈ దాడుల్లో 130 వరకు గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్టు గుర్తించి ధ్వసం చేశామన్నారు. వీటి విలువ సుమారు రూ.1,20000 వరకు ఉంటుందని వివరించారు. గ్రామంలో విచారించగా ఘణపూర్ గ్రామానికి చెందిన మారుతి కౌలు చేస్తున్నాడన్నారు. మారుతి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.