నేరడిగొండ : ప్రముఖ పర్యాటక ప్రదేశంగా పేరున్న కుంటాల జలపాతాన్ని ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ బుధవారం సందర్శించారు. ఇక్కడి జలపాతం అందాలను చూసి సంతోషించారు. ఇలాంటి ప్రకృతి అందాలు ఆదిలాబాద్ జిల్లాలో ఉండడం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ అటవీ సంపద అభివృద్థి చెందిందన్నారు. చెట్లను పెంపొందించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. ఆయన వెంట బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దావుల భోజన్న, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు పాకాల రాంచందర్ పటేల్, రమేశ్, సికిందర్, షేక్ అహ్మద్, రాజన్న, భోజగౌడ్ తదితరులు ఉన్నారు.