మత్స్యకారుల కుటుంబాలకు రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. ఇప్పటికే ఉచితంగా చేపపిల్లలు అందజేస్తూ ఉపాధి కల్పిస్తున్నది. చేపలు పట్టడానికి వెళ్లేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే వారికి 2019 సంవత్సరం నుంచి ఆర్థికంగా ఆదుకోవడానికి బీమా కల్పించింది. నీటిలో జారిపడడం, వలలో చిక్కుకొని చనిపోవడం, విద్యుత్షాక్, అగ్నిప్రమాదానికి గురికావడం, ఎత్తు నుంచి పడడం, పాము, తేలు కాటుకు గురికావడం వంటివి జరిగినపుడు బీమా వర్తిస్తుంది. చనిపోతే బాధితుడి నామినీకి రూ.5 లక్షలు అందజేస్తారు. వీరు మత్స్య సహకార సంఘంలో సభ్యులై ఉంటేచాలు. ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి రూ. 5 లక్షలు, శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే రూ. 2.50 లక్షలు, ఏదైనా ప్రమాదం జరిగి దవాఖానలో చేరితే రూ. 25 వేల సాయం అందజేస్తారు.
– మంచిర్యాల అర్బన్, మార్చి 6
మంచిర్యాల అర్బన్, మార్చి 6 : మత్స్యకారులకు ప్రభుత్వం బీమా పరిహారం మొత్తాన్ని పెంచింది. నీటిలోకి వెళ్లినప్పుడు జారిపడడం, వలలో చిక్కుకొని చనిపోతే ఆ కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తున్నది. ఇలాంటి అనుకోని ప్రమాదం జరిగినప్పు డు ఆ కుటుంబానికి అండగా ఉండేందుకే ఈ స్కీంను ప్రవేశపెట్టింది. రైతుల కోసం రైతుబీమా అమలు చేస్తున్న ప్రభుత్వం మత్స్య కారులకు కూడా బీమా అమలు చేస్తున్నది.
సంఘ సభ్యత్వం ఉంటేనే..
నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ (జాతీయ మత్స్య అభివృద్ధి) బోర్డు, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (జీఏఐఎస్) కింద తీసుకొచ్చిన గ్రూపు బీమాలో మత్స్యకారులు ఎలాంటి ప్రీమి యం చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం ప్రాథమిక సహకార సంఘంలో సభ్యులై ఉంటే చాలు. వారికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 68.40 చొప్పున బీమా కంపెనీకి జమ చేస్తాయి. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి రూ. 5 లక్షలు, శాశ్వత వైకల్యం ఏర్పడితే రూ. 2.50 లక్షల సాయం అందుతుంది. ఏదైనా ప్రమాదం జరిగి దవాఖానలో చేరితే రూ.25వేల సాయం వస్తుంది.
ఆరు నెలల్లో పరిహారం…
సభ్యుడు మరణించినా, వైకల్యం పొందినా నిబంధన ప్రకారం 90 రోజుల్లో దరఖాస్తు ప త్రంలో నామినీ తదితర వివరాలన్నీ రాసి జిల్లా మ త్స్యశాఖ అధికారి కార్యాలయంలో అందించాలి. ఆరు నెలల్లోపు బీమా కంపెనీకి పత్రాలు సమర్పించాలి. 2019-20లో రూ.లక్ష బీమా అందజేసిన ప్రభుత్వం 2021-22లో రూ.2 లక్షలకు పెం చింది. 2022-23లో ఏకంగా రూ.5 లక్షలకు పెం చి బాధిత కుటుంబాలకుఅండగా నిలుస్తున్నది.
5,838 మందికి బీమా…
జిల్లాలో 114 మత్స్య పారిశ్రామిక సంఘాలుండగా 6,516 మంది సభ్యులున్నారు. ఇప్పటి వరకు 5,838 మంది బీమా చేయించుకున్నారు. చెన్నూర్ మండలంలో 138, నెన్నెలలో 349, వేమనపల్లిలో 382, జైపూర్లో 357, భీమారంలో 129, మందమర్రిలో 126, లక్షెట్టిపేటలో 1024, జన్నారంలో 603, నస్పూర్లో 143, హాజీపూర్లో 908, మంచిర్యాలలో 141, దండేపల్లిలో 411, తాండూరులో 303, బెల్లంపల్లిలో 363, కన్నెపల్లిలో 151, భీమినిలో 175, కాసిపేటలో 64, కోటపల్లిలో 21 మంది మత్స్యకారులు బీమా చేయించుకున్నారు.