ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, సెప్టెంబర్ 5: రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సురేశ్ కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు, చేపట్టాల్సి చర్యలపై జిల్లా పోలీసులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులందరూ ఎన్నికల సంఘం నియంత్రణ, పర్యవేక్షణ , క్రమశిక్షణకు లోబడి పని చే యాలని సూచించారు.
జిల్లాలో రెండు నియోజకవర్గాలైన ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్నగర్ నియోజకవర్గాలకు డీఎస్పీలు ఇన్చార్జిలుగా ఉండి బందోబస్తు నిర్వహిస్తారన్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అలాగే గ్రామాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా, సమస్యలు సృష్టించే వా రిని బైండోవర్ చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక గ్రామాల్లో విధిగా పర్యటిస్తూ స్థితిగతులను పరిశీలించాలని సూచించారు. పోలింగ్ రోజు స్టేషన్ల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుంది, అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎలక్షన్ సెల్ ఇన్చార్జి (రెవెన్యూ శాఖ) మధూకర్, ఆసిఫాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ , కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్ , డీసీఆర్బీ డీఎస్పీ రమేశ్ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్, డీసీఆర్బీ ఇన్ప్పెక్టర్ రమేశ్, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు , ఎలక్షన్ సెల్ టీమ్, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.