నిర్మల్ టౌన్, నవంబర్ 30 : నిర్మల్ అసెంబ్లీ స్థానానికి గురువారం జరిగిన ఎన్నికలు ప్రశాంతం గా ముగిసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో రత్నాకల్యాణి తెలిపారు. నిర్మల్, సారం గాపూర్, మామడ, లక్ష్మణచాంద, నర్సాపూర్, దిలావర్పూర్ మండలాలతో పాటు నిర్మల్ మున్సి పాలిటీలోని 322 పోలింగ్ బూత్ల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ నిర్వహించారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు మహిళలు, పురుషులు భారీగా తరలివ చ్చారు. నిర్మల్లోని వైఎస్సార్ కాలనీ, మంజులా పూర్, షేక్సౌపేట్, తదితర కాలనీలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల మధ్య కొంత స్వల్ప ఘటన లు చోటు చేసుకోవడంతో ఇరు వర్గాలను చెదర గొట్టారు.
గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రా ల వద్ద సాయంత్రం 6 గంటల వరకు ఓట్లు వేసేందు కు ఓపికగా నిలబడి ఓటు వేశారు. మంజులా పూర్లో ఈవీఎం మొరాయించడంతో ఓటింగ్ నిలిచిపోవడంతో టెక్నికల్ సిబ్బంది దాన్ని సరి చేశారు. పోలింగ్ కేంద్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారితో పాటు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికా రులు రూట్ అధికారులు, ప్రత్యేక పరిశీలకులు పరిశీలించారు. ఆయా పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సందర్శించారు. పోలింగ్ ను సమర్ధవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయా లని ఆదేశించారు. ఇదిలా ఉండగా నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి, సీఐ పురుషోత్తంచారి పోలింగ్ కేంద్రా లను సందర్శించారు.
రాత్రి 9 గంటల వరకు పోలింగ్సిబ్బంది ఎన్నికలు ఈవీఎంలతో నిర్మల్ ఎన్టీఆర్ స్టేడియానికి తరలివచ్చారు. ఈవీఎంలను పాలిటెక్నిక్ కళాశాలలో జరిగే కౌంటింగ్ కేంద్రానికి పోలీసు భద్రత మధ్య తరలించారు.
నిర్మల్ అర్బన్, నవంబర్ 30 : నిర్మల్లోని శాంతినగర్, రవి నగర్, బంగల్పేట్, బాగుల వాడ, శాస్తినగర్ కాలనీలతో పాటు అన్ని వార్డుల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొన సాగింది. ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరా రు. ఓటర్ స్లిప్పులు, గుర్తింపు కార్డుల ఆధా రంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కు లు వినియోగించుకున్నారు. యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. వృద్ధ్దులు, దివ్యాంగులు పలువురి సహకారంతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్, పట్టణ సీఐ పురుషోత్తం చారి సందర్శించారు.
దిలావర్పూర్ నవంబర్ 30 : దిలావర్పూర్తో పాటు అన్ని గ్రామాల్లో పోలింగ్ ప్రశాంతం జరిగి నట్లు మండల ఎన్నికల పర్యవేక్షకురాలు సరిత తెలిపారు. దిలావర్పూర్లో పోలింగ్ బూత్ లోని ఈవీఎం మొరాయించింది. దిలావర్పూర్ పోలిం గ్స్టేషన్ను ఎస్పీ ప్రవీణ్కుమార్ పరిశీలించారు.
సోన్, నవంబర్ 30 : నిర్మల్, సోన్ మండలా ల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. వెంగ్వా పేట్లో ఉదయం పోలింగ్ ప్రారంభమైన పది నిమిషాల్లోనే ఈవీఎం మొరాయించడంతో దాన్ని స్థానంలో మరొకటి తీసుకొచ్చి పోలింగ్ను అధికా రులు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియో గించుకున్నారు. నిర్మల్ మండలం, సోన్ సీఐలు శ్రీనివాస్, నవీన్కుమార్, ఎస్ఐలు చంద్ర మోహ న్, రవీందర్ పోలింగ్ కేంద్రాల వద్ద బందో బస్తును ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి వీ సత్యనారాయణగౌడ్ సోన్ మండ లం కడ్తాల్ జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సారంగాపూర్, నవంబర్ 30 : మండలంలోని ఆయా గ్రామాల్లో గురువారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు ముగిసింది. బీరవెల్లిలో ఈవీఎంల స్లో వల్ల పోలింగ్ రాత్రి 6:30 కూడా పోలింగ్ పూర్తి కాలేదు. ఓటర్లు క్యూలో నిలబడి ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. జామ్లో 24, 26 పోలింగ్ కేంద్రం సాంకేతిక సమస్య వల్ల ఈవీఎం లు మొరాయించడంతో అరగంట సేపు పోలింగ్ నిలిచిపోయింది. తర్వాత ఓటర్లు క్యూలో నిలబడి ఓటర్లు తమ ఓటుహక్కును వినియో గించుకున్నా రు. మండలంలో 37,163 మంది ఓటర్లు ఉన్నా రు. పోలింగ్ కేంద్రాల 144 సెక్షన్ను విధించారు. జిల్లా ఎస్పీ ప్రవీణ్కుమార్ సారంగాపూర్, జామ్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
లక్ష్మణచాంద, నవంబర్ 30 : అసెంబ్లీ ఎన్ని కలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉద యం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రానికి తరలి వచ్చారు. మండలంలో ఓటర్లు తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. మండలంలో అత్యధి కంగా కనకాపూర్ గ్రామంలోని 90.36 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, అత్య ల్పంగా మునిపెల్లి గ్రామంలో 77.27 శాతం ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగిం చుకు న్నారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు.
నర్సాపూర్(జీ), నవంబర్ 30 : ఆయా గ్రామాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. నిర్మల్ నియోజక వర్గానికి చెందిన కుస్లీ, నర్సాపూర్ (జీ), అంజనీతండా,రాంపూర్, టెంబూర్ణి ్ణగ్రామాల్లో 10624 ఓట్లకు గానూ 8538 ఓట్లు పోల య్యా యి. 80.36శాతం పోలింగ్ జరిగింది. ముథోల్ నియోజక వర్గానికి చెందిన గ్రామాలైన చాక్పల్లి, నందన్, బామ్ని, తురాటి,అర్లి, తిమ్మా పూర్, గొల్లమాడ గ్రామాల్లో 8998 ఓట్లకు గానూ 7209 పోలయ్యాయి.80.11శాతం పోలింగ్ జరిగినది. మండలం మొత్తంలో 80శాతం పోలిం గ్ జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి మండల కేంద్రంలోని 302 పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు.
మామడ, నవంబర్ 30 : మండలంలోని గురువారం నిర్వహించిన అసెంబ్లి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండలంలో 83.21 శాతం పోలింగ్ నమోదైంది. మండలంలో మొత్తం ఓటర్లు 25,603 ఉండగా 21,300 ఓటు వేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను మంత్రి తనయుడు అల్లోల గౌతంరెడ్డి, కోడలు దివ్యరెడ్డి పరిశీలించారు. ఓటింగ్ నమోదు శాతా న్ని అడిగి తెలుసుకున్నారు.
ఖానాపూర్ రూరల్, నవంబర్ 30 : ఐదేండ్ల సుపరిపాలనకు వందేండ్లు నిండిన వృద్ధులు సైతం తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కదిలారు. ఖానాపూర్ మండలం గొసంపల్లె గ్రామానికి చెందిన కొక్కుల వెంకవ్వ 105, కొడిమ్యాల నర్సవ్వ 103 ఏండ్లు నిండిన వృద్ధులు ఓటు వేసి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.